ఐదేళ్లు : పోలవరం, అమరావతి ఎక్కడివక్కడే !

ఓ పనికిమాలిన వ్యక్తిని పదవిలో కూర్చోబెడితే ఏళ్లూ, పూళ్లూ గడిచిపోతాయి కానీ పనులు మాత్రం ముందుకు పడవు. ఓ జీవితంలో ఐదేళ్లు అంటే చిన్న విషయం కాదు. ఐదేళ్ల కిందట ఎలా ఉన్నాం.. ఐదేళ్ల తర్వాత ఎలా ఉన్నామని గుర్తు చేసుకుంటే ఇంత మార్పా అని ఆశ్చర్యపోయే రీతిలో ఉండాలి. కానీ ఏపీ మాత్రం ఐదేళ్ల కిందట ఉన్న స్థితి కంటే దారుణంగా దిగజారిపోయింది. దానికి కళ్ల ఎదుట కనిపించే సాక్ష్యాలు.. . అమరావతి, పోలవరం.

ఏపీ ప్రజల జీవనాడి వెంటిలేటర్ మీద !

పోలవరం గురించి జగన్ రెడ్డి ఎన్నెన్ని కబుర్లు చెప్పారో. నిర్వాసితులకు ఎకరం పది లక్షలన్నారు.. ప్రాజెక్టును చిటికెలో పూర్తి చేస్తామన్నారు. ఐదేళ్లు అయిపోతున్నాయి. మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి..కానీ అక్కడ జరిగిన పనేమీ లేదు. ఐదేళ్లుగా ఖాళీగా ఉంది. కానీ పాత బిల్లులు మాత్రం వసూలు చేసుకున్నారు. ఇలా మూలన పెట్టడం వల్ల ప్రాజెక్టుకు అనేక సమస్యలు వచ్చాయి. కేంద్రం నుంచి రూపాయి అదనంగా తీసుకు రాలేదు. ఇప్పుడు ప్రాజెక్టు భవితవ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పోలవరం అనేది ఏపీ ప్రజల జీవనాడి. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ కరువు నుంచి బయటపడవచ్చు. కానీ జరుగుతున్నది వేరు. 2000లకు పూర్తి చేస్తామన్నారు.. 21,స 22, 23 వచ్చేశాయి.ఇప్పుడు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని అంటున్నారు. ఓ సామాన్యుడు కట్టుకునే చిన్న ఇల్లు ఆపేసి.. ఐదేళ్ల తర్వాత ప్రారంభిస్తే రెట్టింపు ఖర్చు అవుతుంది. ఇప్పుడు పోలవరానికీ ఆ దుస్థితి తెచ్చి పెట్టారు జగన్ రెడ్డి. ఏపీ ప్రజల్ని ఇంత కన్నా ఘోరంగా అన్యాయం చేసిన వ్యక్తి మరికొరు ఉండరు.

సొంత రాష్ట్ర రాజధానిపై కుట్ర చేసిన ఏకైక సీఎం

ఏపీ రాజధాని అనేది ఇప్పుడు కామెడీ టాపిక్ అయిపోయింది. జగన్ రెడ్డి తాను ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో మర్చిపోయారు. అమరావతే రాజధాని అని చెప్పారు. చంద్రబాబు కట్టలేకపోయారని.. తాను రాగనే ఇట్టే కట్టేస్తానని చెప్పుకొచ్చారు. తీరా ఆయన అమరావతిని నట్టేట ముంచారు. అదే అమరావతిలో కూర్చుని పాలన చేస్తూ అదే అమరావతిని విధ్వంసం చేయడానికి నిరంతరం ప్రణాళికలు వేశారు. తాను అధికారం చేపట్టేనాటికి నిర్విరామంగా జరుగుతున్న నిర్మాణాలు పూర్తయి ఉంటే.. ఈ పాటికి అమరావతికి ఓ లుక్ వచ్చి ఉండేది. మొత్తం నాశనం చేసి పెట్టారు. దీన్ని చేసి జగన్ రెడ్డి ఏం సాధించారు ?

స్వయం వినాశ పాలకుడు !

ఒక్క తప్పు చేసినందుకు ఏపీ ప్రజలు పొందిన నష్టం అంచనా వేయడం కష్టం. ఏపీలోని ప్రతి ఒక్కరి ఆస్తులకూ గ్యారంటీ లేకపోవడం కాదు.. అసలు ఆస్తుల విలువలే తగ్గిపోయాయి. జగన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆస్తులు అమ్ముకుని కష్టాలు తీర్చుకుందామని… ఎదురు చూసేవాళ్లకు లెక్కే లేదు. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని మార్చేసిన జగన్ రెడ్డి.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజలకు తీరని అన్యాయం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close