పోరాటం వేరు, మ‌ద్ద‌తు వేరు… సీపీఐది రెండు నాల్క‌ల ధోర‌ణి!

అధికార పార్టీ తెరాస‌కు ఎందుకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నార‌నేది ఇప్ప‌టికీ సీపీఐ నేత‌లు స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోతున్నారు! ఎప్పుడో అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంలో కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నీ, అందుకే ఇప్పుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో తెరాస‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌నే అంటున్నారు. దీంతో సీపీఐ తీరు మీద చాలా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో… ఆర్టీసీ కార్మికులు స‌మ్మెకు దిగారు. కార్మికుల విష‌యంలో సీఎం కేసీఆర్ ధోర‌ణి ఎలా ఉందో చూస్తున్నాం. ఈ నేప‌థ్యంలో ఎల్ల‌ప్పుడూ కార్మికుల ప‌క్ష‌పాత‌ పార్టీగా ఉంటూ వారి హ‌క్కుల కోసం పోరాడే సీపీఐ వైఖ‌రి ఎలా మారిందంటే… రెండు నాల్క‌లుగా క‌నిపిస్తోంది!

కార్మికుల హ‌క్కులను ప్ర‌భుత్వం కాల‌రాస్తుంటే చూస్తూ ఊరుకోమ‌నీ, ఉద్య‌మిస్తామని హెచ్చ‌రిచారు సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట రెడ్డి. ఆర్టీసీ కార్మికుల‌కు తాము అండ‌గా నిలుస్తామన్నారు. అరెస్టు చేసిన ఆర్టీసీ నేత‌ల్ని విడుద‌ల చేయాల‌నీ, గ‌త నెల జీతాలు కూడా వెంట‌నే చెల్లించాలంటూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించినంత మాత్రాన ఉద్యోగాలు పోతాయా అని ప్ర‌శ్నించారు. త‌మిళ‌నాడులో ఇలానే ఉద్యోగాలు తీసేస్తామని నాటి జ‌య‌ల‌లిత అంటే ఉద్యోగాలు పోయాయా అని ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ క‌క్ష సాధింపు ధోర‌ణిలో మాట్లాడుతున్నార‌నీ, స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా ఆలోచించాల‌న్నారు.

హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో తెరాస‌కు జై అని… ఇప్పుడు ఆర్టీసీ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేసరికి ముఖ్య‌మంత్రి వైఖ‌రిని త‌ప్పుబ‌డుతున్నారేంటీ అని చాడాని అడిగితే… రాజ‌కీయం వేరు, పోరాటం వేరు అన్నారు! హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఉన్న అవ‌స‌రాలు వేరు, ఇప్పుడు స‌మ్మె వేరట‌! అంటే, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు వేరు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వేరు అన్న‌ట్టే క‌దా! ఇలా రెండు నాల్క‌ల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తే… క‌మ్యూనిష్టుల‌ను ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగానే, ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచాల‌న్న ఆలోచ‌న సీపీఐకి ఉంటే, హుజూర్ న‌గ‌ర్ లో మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించుకుంటే త‌ప్పేముంది? ఆ ప‌నిచేస్తే ఆర్టీసీ కార్మికుల స‌మ్మె విష‌యంలో కేసీఆర్ ఒక మెట్టు దిగినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు! ఎందుకంటే, హుజూర్ న‌గర్లో సీపీఐ ఓటు బ్యాంకు అవ‌స‌రం తెరాస‌కు చాలా ఉంది. ఇలాంటి వ్యూహంతో వ్య‌వ‌హ‌రిస్తే ఆర్టీసీ కార్మికుల‌కు మంచి చేసిన‌ట్టూ అవుతుంది, త‌మ స‌త్తాను చాటుకున్న‌ట్టూ అవుతుంది. కానీ, అలాంటి ఆలోచ‌న వీరికి ఉన్న‌ట్టే లేదు. అందుకే రాజ‌కీయం వేరు, పోరాటం వేరు అంటున్నారు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close