జాతీయహౌదా కన్న సైకిల్‌ మిన్న

ఇటీవల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన వివిధ స్థాయిల కార్యవర్గాలలో పెద్ద సంచలనాలేమీ లేవు. కాకుంటే ఫిరాయింపుదార్లకు పెద్దపీట వేసి విధేయులను చిన్నబుచ్చారనే విమర్శ ఒకటి ఎలాగూ వుంటుంది.వచ్చిన వారిని ఇముడ్చుకోవడం కోసం చేసే పనే అది. ఈ సందర్భంగా చంద్రబాబు జాతీయ అద్యక్షుడుగా లోకేశ్‌, ఇ.పెద్దిరెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించారు. ఇదంతా గంభీరంగా కనిపించేందుకు లోకేశ్‌కు పార్టీలో స్థానాన్ని అట్టిపెట్టేందుకు చేసే పని తప్ప రాజకీయంగా ఇతర జాతీయ పదవులకు పెద్ద ప్రాధాన్యత లేదని టిడిపి నాయకులు తేల్చిచెబుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబుకు అలాటి మోజు వుండేది. చుట్టుపక్కల రాష్ట్రాలలో సీట్లు రాకున్నా ఓట్ల శాతం తెచ్చుకుని జాతీయ ముద్ర వేసుకోవాలన్న కాంక్ష వుండేది. అది కేంద్రంలో కీలకపాత్రకు తోడ్పడుతుందన్న వ్యూహంతో అవన్నీ ఆలోచించేవారు. అయితే ఇప్పుడు దానిపై అంత ఆసక్తి లేదు. తెలంగాణలోనే పార్టీ దెబ్బతిన్నది. తమిళనాడులో జయలలిత వుంటే ఏవైనా అప్రధానమైన సీట్లు తెచ్చుకోవడానికి అవకాశం వుండేదేమో.. ఆపైన తెలుగువారు ఎక్కువ వుండే మరేదైనా రాష్ట్రంలోనూ ఓట్లు తెచ్చుకుంటే సరిపోయేది. ఇప్పుడదంతా మారింది. తమిళనాడు అస్తవ్యస్తంగా వుంది. జాతీయంగా మోడీ ప్రభుత్వం చంద్రబాబుపై విముఖత కొనసాగిస్తున్నది.ఇలాటప్పుడు జాతీయ ఆశలు ఆవిరై పోతున్నాయి. పైగా మరో పెద్ద సమస్య జాతీయ పార్టీ అయితే సైకిల్‌ గుర్తు వుండదు. సమాజ్‌వాది పార్టీకి ఆ గుర్తు వుంది కనుక మాకు రాదు. ఈ గుర్తును కాపాడుకోవడం పార్టీకి చాలా ఉపయోగం. అప్పట్లో గుర్తు కోసమే ఎన్టీఆర్‌తో ఘర్షణ పడాల్సి వచ్చింది. ఇప్పుడు దాన్ని పోగొట్టుకోలేము.పైగా జాతీయంగా అవకాశాలు కూడా లేవు.కాబట్టి అది కేవలం అలంకారం మాత్రమేనని ఆ నాయకుడు స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close