డీఎస్… కనబడుట లేదు…!

డీఎస్. డీ. శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. సమైఖ్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి రాజ్యసభ సభ్యత్వం పొందారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి, ముఖ్యమంత్రి కే.చంద్రశే్ఖర రావుకు తలలో నాలికలా ఉండేవారు. అయితే ఆ తర్వాతే డీ.శ్రీనివాస్ పార్టీకి దూరంగా జరిగారు. డీ.శ్రీనివాస్ కుమారుడు డీ.అర్వింద్ భారత జనతా పార్టీలో చేరినప్పటి నుంచి డీఎస్ తెలంగాణ రాష్ట్ర సమితికి దూరంగానే ఉంటున్నారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డీ.అర్వింద్ ఏకంగా ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవితపు ఓడించడంతో డీ.శ్రీనివాస్ మెల్లిగా పార్టీకి దూరం కావడం ప్రారంభించారు. ఒక దశలో పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయండని కూడా ప్రకటించారు. అయినా, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మాత్రం ఈ ప్రకటనలపై ఎక్కడా స్పందించలేదు. అలాగే పార్టీలో ఎవ్వరిని పల్లెత్తు మాట కూడా అనకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి డీ.శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడనే విషయమే పార్టీ మరచిపోయింది. ఆ మధ్య తన రాజ్యసభ సభ్యత్వానికి డీఎస్ రాజీనామా చేస్తారని, కుమారుడితో కలిసి బీజేపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కాని డీఎస్ మాత్రం బీజేపిలో చేరలేదు. అలాగని తెలంగాణ రాష్ట్ర సమితిలోను కనిపించడం లేదు. దేశంలో ఏం జరిగినా వెంటనే స్పందించే డీ.శ్రీనివాస్ గత ఏడాది కాలంగా మౌనంగా ఉన్నారు. ఆయన ఎక్కడున్నారో… ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశాలకు కాని, ప్రభుత్వ కార్యక్రమాలకు కాని హాజరు కావడం లేదు. దీంతో ఆయన గురించి పార్టీలో చర్చ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల దగ్గర పడడంతో మరోసారి డీ.ఎస్ ఎక్కడున్నారనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ఇంతకీ డీఎప్ పార్టీతో ఉన్నారా… లేక పార్టీని వీడారో తెలియక పార్టీ శ్రేణులు కలవరపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close