బీజేపీకి సర్దార్ పటేల్‌లా.. జనసేనకు దామోదరం సంజీవయ్య..!

పవన్ కల్యాణ్ మరో భూరి విరాళం ప్రకటించారు. దామోదరం సంజీవయ్య స్మారకం కోసం రూ. కోటి విరాళం ప్రకటించారు. ఆ కోటితో పాటు నిధిని ఏర్పాటు చేసివిరాళాలు సేకరించి ఆయన స్మారకం నిర్మిస్తామన్నారు. దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి. రెండేళ్ల పాటు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే రెండేల్లలోనే ఎన్నో కీలకమైన పనులు చేశారు. కానీ ఆయనకు తగినంత గుర్తింపు రాలేదు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన పదవిని కోల్పోక తప్పలేదు. ఆ తర్వాత ఆయనను స్మరించుకోవడం కూడా తగ్గిపోయింది.

అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఆయన మంచి పనులన్నింటినీ వెలుగులోకి తెచ్చారు. ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి అయిన సంజీవయ్య . హైదరాబాద్‌ పరిసరాల్లో 6లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ప్రారంభించారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారు. వీటన్నింటినీ పవర్ గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గాల్లో ఆయన సభ్యుడు.

పవన్ కల్యాణ్ రూ. కోట్లలో విరాళాలు ప్రకటిస్తూ ఉంటారు. గతంలో సైనిక సంక్షేమ నిధికి కూడా ప్రకటించారు. ఆ తరహాలో ఈ సారి దామోదరం సంజీవయ్య ఇంటి కోసం రూ. కోటి ప్రకటించారు. అయితే ఇది రాజకీయ కార్యక్రమానికి ప్రకటించిన విరాళం అనుకోవచ్చు. బీజేపీ పటేల్‌ను పోస్టర్ బాయ్‌గా వాడుకున్నట్లుగా .. జనసేన ఇక నుంచి దామోదరం సంజీవయ్యను ముందుపెట్టి రాజకీయం చేసే వ్యూహం అమలు చేస్తున్నారని అనుకోవచ్చు. సీరియస్‌గా ఈ అంశంపై దృష్టి పెట్టి.. సంజీవయ్య సేవలను జనసేన అడాప్ట్ చేసుకుంటే.. దళిత వర్గాల్లో మరింత ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు జనసేనకు అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close