వైకాపా అవిశ్వాసానికి ‘తెదేపా మార్క్’ వ్యూహంతో చెక్

తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి తెదేపా తనదైన శైలిలో ఎదురుదెబ్బ తీసి కంగు తినిపించింది. అదిచ్చిన నోటీసును స్వీకరించిన స్పీకర్ కోడెల శివప్రసాద రావు, వెంటనే బి.ఏ.సి. సమావేశం నిర్వహించేరు. దానిలో అధికార పార్టీ, దాని మిత్రపక్షమయిన భాజపా సభ్యులదే పైచెయ్యిగా ఉంటుంది కనుక వారు దానిపై తక్షణమే సభలో చర్చ మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఆవిధంగా చేయడం ద్వారా వైకాపా తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేయడం సాధ్యం కాదు కనుక ఆ పార్టీలో నుంచి ఇటీవల తెదేపాలోకి మారిన తమ 8మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని కోరే అవకాశం వైకాపా కోల్పోయింది. ఊహంచని ఈ ఎత్తుగడకి వైకాపా కంగు తింది. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి అందుకు తెదేపాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మా పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసే అవకాశం లేకుండా చేయదానికే తెదేపా ఈ చవకబారు ఎత్తుగడ వేసిందని అర్ధమవుతూనే ఉంది. తద్వారా తెదేపాలో చేరిన మా పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాపాడుకోవాలని తెదేపా తాపత్రయపడుతోంది. శాసనసభ చరిత్రలో ఇంత అనైతికంగా, అప్రజాస్వామికంగా నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. తెదేపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అన్ని విధాలుగా ఖూనీ చేస్తూ పరిపాలన సాగిస్తోంది,” అని విమర్శించారు.

ఆ పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింటు దగ్గర మాట్లాడుతూ “తెదేపా ఇటువంటి చవకబారు ఎత్తులు వేస్తుందని మేము ముందే ఊహించాము. అందుకే మేము నిన్న సాయంత్రమే మా పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఎస్.ఎం.ఎస్. ఈ.మెయిల్, టెలిగ్రాం వంటి ఇతర మార్గాల ద్వారా విప్ జారీ చేసాము,” అని చెప్పారు.

తెదేపా ఆవిధంగా వ్యవహరించడం చాలా తప్పేనని చెప్పవచ్చును. దీనిపై వైకాపా ఆవేదన చూస్తే అది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వెనుక దాని అసలు ఉద్దేశ్యం కూడా వారి నోటితో వారే స్వయంగా బయటపెట్టుకొన్నట్లయింది. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారనే ఉద్దేశ్యంతోనే తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని వైకాపా నేతలు చెప్పుకొన్నారు. కానీ ఆ సాకుతో తెదేపాలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలకి విప్ జారీ చేసి, వారిపై అనర్హత వేటు పడేల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు వారే స్వయంగా చాటుకొన్నట్లయింది. ఒకే దెబ్బకు రెండు వీలయితే ఇంకా ఎక్కువ పిట్టలు కొట్టేయాలని ప్రయత్నించి భంగపడుతుంటం జగన్మోహన్ రెడ్డికి అలవాటే కనుక మళ్ళీ ఇప్పుడు కూడా మరోసారి భంగాపడ్డారని సరిపెట్టుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close