కన్నయ్య కుమార్ బెయిల్ ని వ్యతిరేకించిన డిల్లీ పోలీసులు

డిల్లీ జె.ఎన్.యు. విద్యార్ధి కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ చేపట్టిన డిల్లీ హైకోర్టు, ఈ వ్యవహారంపై యూనివర్సిటీ కమిటీ దర్యాప్తు చేసిన ఇచ్చిన నివేదికను కూడా కోర్టుకు సమర్పించాలని డిల్లీ పోలీసులను ఆదేశిస్తూ, కేసును ఈరోజుకి వాయిదా వేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఉమర్ ఖాలిద్, అనిర్భాన్ భట్టాచార్యలు ఇద్దరూ పోలీసులకు లొంగిపోయేందుకు సంసిద్దత వ్యక్తం చేసారు. వారు కూడా తమకు రక్షణ కల్పించాలని కోర్టుకి విజ్ఞప్తి చేసారు.

ఈ కేసులో డిల్లీ పోలీసుల చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు కనబడుతోంది. మొదట వారి అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలనుకొన్నారు. కానీ సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడంతో వెనక్కి తగ్గవలసి వచ్చింది. కొన్ని రోజుల క్రితం, వారి తరపున వాదించిన న్యాయవాది ‘తాము కన్నయ్య కుమార్, అతని సహచర విద్యార్ధులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొంటే వ్యతిరేకించబోమని’ హైకోర్టుకి తెలిపారు. కానీ మళ్ళీ నిన్న ‘మారిన పరిస్థితుల దృష్ట్యా’ వారి బెయిల్ ని వ్యతిరేకించాలనుకొంటున్నట్లు కోర్టుకి తెలియజేసారు. ఈ కేసుపై డిల్లీ పోలీస్ కమీషనర్ బస్సికి పోలీసులు నిన్న ఒక ప్రాధమిక నివేదికను అందజేశారు. దానిలో ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న కన్నయ్య కుమార్, తదితరులను దోషులుగా నిరూపించే ఎటువంటి ఆధారాలు చూపలేదు. కేవలం ఒక టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగ్ ఆధారంగానే ఈ కేసు నమోదు చేసినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.

యూనివర్సిటీ ప్రాంగణంలో అఫ్జల్ గురు సంస్మరణ సభను నిర్వహించినట్లు చెప్పబడుతున్న ఉమర్ ఖాలిద్, అనిర్భాన్ భట్టాచార్య, మరో ముగ్గురు విద్యార్ధులు గత వారం రోజులుగా పరారీలో ఉన్నారు. వారు మొన్న ఆదివారం రాత్రి మళ్ళీ యూనివర్సిటీకి తిరిగివచ్చేరు. వారిలో ఉమర్ ఖాలిద్, అనిర్భాన్ భట్టాచార్య పోలీసులకు లొంగిపోవడానికి సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు. కనుక వారి ద్వారా కన్నయ్య కుమార్ ని దోషిగా నిరూపించేందుకు ఆధారాలు రాబట్టవచ్చని డిల్లీ పోలీసులు భావిస్తున్నందునే కన్నయ్య కుమార్ బెయిల్ ని వ్యతిరేకిస్తామని కోర్టుకి తెలియజేసి ఉండవచ్చును. ఈరోజు డిల్లీ హైకోర్టు మళ్ళీ అతని బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టి తీర్పు చెప్పే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

రెడ్డి గారి “మేఘా” క్విడ్ ప్రో కో !

1989లో సిమెంట్ పైపులు తయారు చేసే కంపెనీ మేఘా ఎంటర్ ప్రైజేస్. పి. పిచ్చిరెడ్డి దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఆ కంపెనీ రాజకీయ పార్టీలకు రెండున్నర...

దానంపై అనర్హతా వేటుకు బీఆర్ఎస్‌ ఫిర్యాదు – పాతవన్నీ గుర్తుకు రావా ?

దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ తరపున గెలిచినందున ఆయనపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఇంకెవరూ లేనట్లుగా పాడి కౌసిక్ రెడ్డి...

రోజాను బూతులు తిట్టిన బండారుకు వైసీపీ ఎంపీ టిక్కెట్ ?

వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా ఒక్క అనకాపల్లి ఎంపీ స్థానానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ బీసీకి ఇస్తున్నామని కులం పేరు ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీగా హ్యాండిచ్చినట్లుగా స్పష్టమయింది. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close