తెలంగాణకు వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కాం !

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలోనూ కలకలం రేపే అవకాశఆలు కనిపిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీశ్ సిసోడియాతో పాటు 15 మందిని ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా సీబీఐ పేర్కొంది హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఎ 14గా సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఉండటం కలకలం రేుపతోంది. లిక్కర్ స్కామ్‌లో ఏ1 గా సిసోడియా పేరు .. ఏ14 గా రాంచంద్ర పిళ్లై పేరును చేర్చారు. ఇండో స్పిరిట్ పేరుతో బెంగళూరు కేంద్రంగా లిక్కర్ రాంచంద్ర పిళ్లై లిక్కర్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఆయన ఆయన ఆ కంపెనీలో డైరక్టర్‌గా లేరు.

కానీ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పీ అనే కంపెనీలో డైరక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీలో ఆయనతో పాటు ఉన్న మరో డైరక్టర్ పేరు బోయినపల్లి అభిషేక్. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా టెండర్ దక్కించుకోవడానికి అరుణ్ పాండ్యా ద్వారా మనీష్ సిసోడియాకు డబ్బులు ఇచ్చినట్లుగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. రూ. 2.50 కోట్లు సిసోడియాకు లంచంగా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ స్కాంతో తెలంగాణకు సంబంధం ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఢిల్లీలో ప్రకటించారు.

కొత్త పాలసీ రూపకల్పన .. స్కామ్ అంతా అంతా తెలంగాణలోనే జరిగిందని ఆయన అంటున్నారు. ఈ డీల్ సెట్ చేయడానికి తెలంగాణకు చెందిన వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లకు మనీష్ సిసోడియా వెళ్లారని తెలిపారు. ఇందులో 10 నుంచి 15 మంది ప్రైవేట్ వ్యక్తులతో పాటు సిసోడియా కూడా ఉన్నారని భావిస్తున్నట్టు వివరించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణ వరకూ వచ్చినట్లుగా తెలుస్తోంది. రామచంద్ర పిళ్లై శాశ్వత నివాసం హైదరాబాద్ లో ఉంది. దీంతో ఇక్కడా రాజకీయ ప్రకంపనలు రేగడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close