దేవిశ్రీ‌కి అగ్ని ప‌రీక్షే

ఒక‌ప్పుడు దేవిశ్రీ ప్ర‌సాద్ ఆల్బ‌మ్ అంటే ఆరింటికి ఆరూ సూప‌ర్ హిట్ గీతాలొచ్చేవి. ఇప్పుడు ఆరు పాట‌ల్లో ఒక్క‌టి హిట్ అవ్వ‌డ‌మే గ‌గ‌నం అయిపోయింది. దేవి పాట‌ల‌పై కాపీ ముద్ర కూడా ప‌డ‌డం… అత‌ని పాట‌ల‌పై మాయ‌ని మ‌ర‌క‌గా మిగులుతోంది. దానికి తోడు త‌మ‌న్ మ‌రోవైపు దూసుకుపోతున్నాడు. త‌మ‌న్ వ‌న్నీ మ్యూజిక‌ల్ హిట్సే. ఆల్బ‌మ్‌లో ఒక్క పాటైనా…. రికార్డు స్థాయిలో మార్మోగుతోంది. దాంతో దేవిశ్రీ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పుడు త‌న ముందున్న మార్గం ఒక్క‌టే. మ‌రో సూప‌ర్ హిట్ ఆల్బ‌మ్ తో ట్రాక్ లోకి రావ‌డం. ఈమ‌ధ్య `ఉప్పెన` చిత్రంలో ఓ మంచి పాట అందించాడు దేవి. ఈ పాట‌తో దేవీ మ్యాజిక్ మ‌ళ్లీ క‌నిపించింది, వినిపించింది. ఇప్పుడు మ‌రో అవ‌కాశం దేవి ముంగిట ఉంది. అదే సుకుమార్ తో సినిమా.

సుకుమార్ – దేవిశ్రీ‌ల‌ది ఎవ‌ర్ గ్రీన్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ సుకుమార్ దేవిని వ‌దిలిపెట్ట‌లేదు. సుకుమార్ సినిమా అన‌గానే దేవి కూడా అదే స్థాయిలో రెచ్చిపోయి పాట‌లిస్తాడు. ఫామ్ లో లేన‌ప్పుడు కూడా `రంగ‌స్థ‌లం` ఆల్బ‌మ్ తో దేవి అద‌ర‌గొట్టాడు. `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాకి త‌మ‌న్ మంచి పాట‌లిచ్చిన్ప‌ప‌టికీ, దేవిశ్రీ ఎంపిక‌ను బ‌న్నీ కూడా కాద‌లేక‌పోయాడు. దానికి కార‌ణం… దేవిశ్రీ‌తో బ‌న్నీకి ఉన్న అనుబంధం. అల్లు అర్జున్‌కి కూడా దేవి మంచి పాట‌లే ఇచ్చాడు. ఇప్పుడు అటు బ‌న్నీని, ఇటు సుక్కునీ, మొత్తంగా త‌న అభిమానుల్ని సంతృప్తిప‌ర‌చాల్సిన బాధ్య‌త దేవిశ్రీ‌పై ఉంది. ఈ సినిమాకి మంచి పాట‌లిస్తే స‌రేస‌రి. లేదంటే.. దేవిశ్రీ కోలుకోవ‌డం క‌ష్ట‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close