వైసీపీలోకి దేవినేని అవినాష్..!?

తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్… తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఇసుక విషయంలో చంద్రబాబు దీక్ష ప్రారంభించడానికి ఒక్క రోజు ముందు… తన అనుచరులతో సమావేశం అయ్యారు. పార్టీ మార్పు అంశంపై చర్చించారు. పార్టీలో కష్టపడి పని చేస్తున్నప్పటికీ.. తనకు ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు మాటకు కట్టుబడి పనిచేసిన అవినాష్‌కి.. పార్టీలో తగిన న్యాయం జరగలేదంటుని అవినాష్‌ అనుచరులు .. టీడీపీ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నేతలు.. ఆవినాష్‌కు ప్రాధాన్యం దక్కకుండా చేస్తున్నారంటున్నారు. పార్టీ మారాలని అవినాష్‌పై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

న్యాయం జరగని టీడీపీలో ఎంత కష్టపడి పనిచేసినా.. విలువ ఉండదని అవినాష్ ఓ అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇంత హఠాత్తుగా.. దేవినేని అవినాష్… అనుచరులతో ఎందుకు సమావేశం అవ్వాల్సి వచ్చిందనేదానిపై.. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేవినేని అవినాష్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు.. వైసీపీ కొద్ది రోజులుగా ప్రయత్నిస్తోంది. ఆయనతో.. చర్చలు కూడా జరిపింది. కారణం ఏమిటో తెలియదు కానీ.. చాలా సార్లు దేవినేని అవినాష్ ఆ వార్తలను ఖండించారు. ప్రాణం పోయే వరకూ టీడీపీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఆయనకు.. గుడివాడ టిక్కెట్ ను చంద్రబాబు కేటాయించారు. కొడాలి నానికి గట్టి పోటీ ఇచ్చి.. పరాజయం పాలయ్యారు. తెలుగు యువత అధ్యక్షుడిగా కీలకంగానే పని చేస్తున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత ఉపఎన్నికలొస్తే… అక్కడ అభ్యర్థిగా… దేవినేని అవినాష్ పేరును కూడా కొంత మంది ప్రతిపాదించారు. అయితే.. పార్టీలో అంతర్గత రాజకీయాలు… ప్రాధాన్యత దక్కకుండా చేస్తున్నాయని ఆయన నమ్ముతున్నారు. వైసీపీ నుంచి ఆఫర్ ఉండటంతో… ఆ దిశగా ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ మార్పు నిర్ణయాన్ని ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close