మైహోమ్‌పై “ధర్మపురి” పోరాటం బెదిరింపులకేనా..!?

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ … పండుగ పూట పనిగట్టుకుని వెళ్లి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌ను కలిశారు. ఎందుకంటే.. మైహోమ్ సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోంది.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి. అసలు మైహోమ్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి ఏ స్థాయిలో ఉందో.. సాధారణ రాజకీయ నాయకుడికి కూడా తెలుసు. అయినప్పటికీ అర‌వింద్ ప్రత్యేకంగా వెళ్లి ఆ సంస్థపై ఫిర్యాదు చేశారు. గతంలో అరవింద్ ఈ సంస్థ అక్రమ మైనింగ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్రం కూడా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిందని కూడా ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ.. కేంద్రానికి వెళ్లలేదు. దీనిపై అరవింద్ ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టలేకపోయారు.

అప్పుడప్పుడు కేంద్ర మంత్రులతో సమావేశమై.. మైహోమ్ పై ఫిర్యాదు చేస్తున్నట్లుగా ప్రెస్‌నోట్లు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కూడా అంతే. తాజాగా.. ఆయన ఆరోపణలు చేస్తున్న మైహోమ్ సంస్థకు నల్గొండలోనే.. మరో ఆరు వందల ఎకరాలు మైనింగ్ కోసం ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. దీని కోసం ప్రజాభిప్రాయసేకరణ కూడా నిర్వహించింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో.. కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ… బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న విషయం మీడియాలో హైలెట్ అయింది. అయితే అరవింద్ మాత్రం.. ఆ లీజు కూడా ఇవ్వవొద్దని తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నారు

నిజంగా మైహోంసంస్థ అక్రమాలపై సాక్ష్యాలుంటే.. అరవింద్ కేంద్ర ప్రభుత్వంతోనే విచారణకు ఆదేశించేలా చేయవచ్చు. ప్రైవేటు సంస్థల అక్రమాలపై దర్యాప్తులు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు. ఇలా ఎన్నో సంస్థలపై విచారణ చేపడుతున్నారు. ఒక వేళ కేంద్రం కూడా ఆసక్తి చూపించకపోతే.. కక్ష సాధింపులనుకుంటారంటే.. ఆయన కోర్టుకు పోవచ్చు. కోర్టులో సాక్ష్యాలు సమర్పించి.. సీబీఐ విచారణ ఆదేశాలు తీసుకు రావొచ్చు. కానీ ఆయన అడపాదడపా మీడియా సమావేశాల్లో ప్రకటనలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో.. ఇది రాజకీయ బెదిరింపు వ్యూహం తప్ప మరోకటి కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close