మోడీతో భేటీ తర్వాత పవన్ సైలెంట్ అయ్యారా ?

ఓట్లు చీలనివ్వనని చాలెంజ్‌లు చేసిన పవన్ కల్యాణ్.. మోడీతో భేటీ తర్వాత సైలెంట్ అయిపోయారని సీపీఐ నేత నారాయణ చెబుతున్నారు. అంతకు ముందు ఆయన ఆవేశం ఇప్పుడు ఏమయిందని అడుగుతున్నారు. మోదీతో పవన్ భేటీ తర్వాత జనసేన లో మార్పు వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు అదేపనిగా జనసేన మాతోనే ఉంటందని చెబుతున్నారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ తర్వాత ఎప్పుడూ మాట్లాడలేదు కానీ.. నాదెండ్ల మనోహర్ మాత్రం.. వైసీపీ ముక్త ఏపీ కోసం పని చేస్తున్నామని .. అందరం కలసి పోరాడాలని పిలుపునిచ్చింది.

పవన్ కల్యాణ్ ఆలోచనలు స్థిరంగా లేకపోవడం.. క్యాడర్‌కు ఒకే సందేశం వెళ్లకపోవడ ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్ని సైతం బాగా ఇబ్బంది పెడుతోంది. వైసీపీ నేతల సంగతి తేలుస్తానంటూ ఓ సందర్భంలో చెప్పూ చూపించిన పవన్.. వెంటనే చంద్రబాబుతో భేటీ కావడంతో ద్వారా జగన్‌కు డేంజర్ బెల్స్ మోగించారు. కానీ మోడీతో జరిగిన భేటీ తర్వాత మాత్రం ఆయనతో మార్పు వచ్చినట్లుాగ ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తారా.. బీజేపీతో పోటీ చేస్తారా అన్నదానిపై మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వలేకపోతున్నారు. టీడీపీతో కలిస్తే గెలుపు ఖాయమని వస్తున్న రిపోర్టులతో కూడా ఆయన ధైర్యంగా అడుగు వేయలేకపోతున్నారు.

గత ఎన్నికల్లో సీపీఐతో కలిసే జనసేన పోటీ చేసింది. అందుకే సీపీఐ నేత నారాయణ… వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు ఉండాలనుకుంటున్నారు. వైసీపీని ఓడించాలంటే టీడీపీ, జనసేన, వామపక్షాలు కలవాలంటున్నారు. అయితే జనసేన కు మాత్రం ఈ విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు టీడీపీ వైపు వెళ్లకుండా.. మోదీ స్థాయిలో ఏదైనా ప్రయత్నం జరిగిందో లేదో కానీ.. అదే జరిగితే.. వైసీపీని మరోసారి గెలిపించడమేనన్న అభిప్రాయం జనసేనలో కూడా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close