సదావర్తి కుంభకోణంపై వైకాపా పోరాటం ముగిసినట్లేనా?

సదావర్తి సత్రవ భూముల కుంభకోణాన్ని వెలికి తీసి తెదేపా ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన వైకాపా, ఇప్పుడు దానిపై ఆసక్తి కోల్పోయినట్లుంది. దానిపై మొదలుపెట్టిన పోరాటాన్ని పక్కనపడేసి ఇప్పుడు ‘గడప గడపకి వైకాపా’ కార్యక్రమంతో వైకాపా బిజీ అయిపోయింది. ఒకవేళ సదావర్తి కుంభకోణంపై వైకాపా తన పోరాటాన్ని కొనసాగించి ఉండి ఉంటే తెదేపా ప్రభుత్వానికి చాలా నష్టం జరిగి ఉండేది. కనుక సదావర్తిని వైకాపా అంతటితో వదిలిపెట్టడం తెదేపాకి చాలా ఉపశమనం కలిగించే విషయమేనని భావించవచ్చు. అందుకే తెదేపా నేతలెవరూ కూడా ఇప్పుడు సదావర్తి ప్రసక్తి తేకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు.

వైకాపా ఈ విధంగా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రాజధాని భూసేకరణ, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, బాక్సైట్ త్రవ్వకాలు, కాల్ మనీ, రాజధానిలో బినామీ భూముల కొనుగోళ్ళు, తెలంగాణా ప్రాజెక్టులు వంటి అనేక సమస్యలు, కుంభకోణాలపై పోరాటాలు మొదలుపెట్టి ఏదీ పరిష్కారం కాకుండానే ఒక సమస్య నుంచి మరొకదానికి షిఫ్ట్ అయిపోతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేస్తోంది.

ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు ఒకే సమస్యపై నిరంతరంగా పోరాడటం అసంభవం. ఎప్పటికప్పుడు సరికొత్త సమస్య లేదా కుంభకోణంతో ప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించగలవు. అప్పుడే ప్రభుత్వ అసమర్ధత, అవినీతి గురించి ప్రజలకి తెలియజేసే అవకాశం ఉంటుంది. బహుశః అందుకే వైకాపా కూడా సదావర్తి నుంచి ‘గడప గడపకి వైకాపా’కి షిఫ్ట్ అయిపోయిందని సరిపెట్టుకోవాలి. ఒక సమస్యపై ఎక్కువ రోజులు పోరాటం చేయలేని ప్రతిపక్షాల ఈ వీక్ నెస్ ని ప్రభుత్వం కూడా గుర్తించినట్లే ఉంది కనుక అవి ఓ సమస్యపై పోరాడుతున్నప్పుడే అది కూడా వాటి గురించి మాట్లాడుతుంటుంది. ఆ తరువాత అది కూడా దానిని పక్కన పడేస్తుంటుంది. అధికార, ప్రతిపక్షాలు ఆడుకొనే ఈ రాజకీయ చదరంగంలో చివరికి అన్నివిధాల నష్టపోయేది ప్రజలు, రాష్ట్రమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close