ఇదీ ‘దిల్’ రాజు మార్క్ పబ్లిసిటీ…

సినిమాను తీయడం మాత్రమే కాదు… ఎలా ప్రమోట్ చేయాలో? మార్కెటింగ్ చేయాలో? బాగా తెలిసిన వ్యక్తి ‘దిల్’ రాజు. అందులో ఆయనది పీహెచ్‌డీ పట్టా. ఆయన నిర్మించిన సినిమాల పబ్లిసిటీ మాత్రమే కాదు… హోల్‌సేల్‌గా థియేట్రిక‌ల్ రైట్స్ కొనుకొన్న సినిమాల పబ్లిసిటీ కార్యక్రమాలను సైతం దగ్గరుండి ప్లాన్ చేస్తారు. పర్యవేక్షిస్తారు. దర్శకుడు పూరి జగన్నాథ్ లేటెస్ట్ సిన్మా ‘మెహబూబా’ను ‘దిల్’ రాజు కొన్న సంగతి తెలిసిందే. ఆయనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సిన్మాకి ముందు పూరి తీసిన నాలుగైదు సిన్మాలు అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. దీనికి తోడు హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవాళ్ళే. అందువల్ల సిన్మాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు లేవు. ఈరోజుల్లో ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సిన్మాకి కీలకం అవుతున్నాయి. అందుకని తన మాస్టర్ బ్రెయిన్‌కి పని పెట్టారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు కాలేజీ విద్యార్థులకు స్పెషల్ షో వేశారు. ఆయన నిర్మించిన ‘ఫిదా’, ‘శతమానం భవతి’ సినిమాలకు ఇదే విధంగా స్పెషల్ షోలు వేశారు. ఇప్పుడు పూరి సినిమాకు సేమ్ ట్రెండ్ ఫాలో అయ్యారు. ‘మెహబూబా’ టీమ్ అమెరికా వెళ్లి రెండు వారాల పాటు అక్కడ సినిమాను ప్రమోట్ చేయాలనుకోవడంలోనూ ‘దిల్’ రాజు సలహాలు వున్నాయట. ఇదీ ‘దిల్’ రాజు మార్క్ పబ్లిసిటీ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సినిమా మీద నమ్మకంతో రెండు రోజుల ముందు బయట జనాలకు షో వేయాలనుకోవడం ఒక కారణం అయితే… బుధవారం ‘మహానటి’ విడుదల కావడం మరో కారణంగా తెలుస్తోంది. ‘మహానటి’గా ముందుగా అమెరికాలో మంచి టాక్ వచ్చేసింది. ఆ హిట్ హడావుడిలో ‘మెహబూబా’ను ఎక్కడ మర్చిపోతారోనని షో వేశార్ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close