సినిమాను తీయడం మాత్రమే కాదు… ఎలా ప్రమోట్ చేయాలో? మార్కెటింగ్ చేయాలో? బాగా తెలిసిన వ్యక్తి ‘దిల్’ రాజు. అందులో ఆయనది పీహెచ్డీ పట్టా. ఆయన నిర్మించిన సినిమాల పబ్లిసిటీ మాత్రమే కాదు… హోల్సేల్గా థియేట్రికల్ రైట్స్ కొనుకొన్న సినిమాల పబ్లిసిటీ కార్యక్రమాలను సైతం దగ్గరుండి ప్లాన్ చేస్తారు. పర్యవేక్షిస్తారు. దర్శకుడు పూరి జగన్నాథ్ లేటెస్ట్ సిన్మా ‘మెహబూబా’ను ‘దిల్’ రాజు కొన్న సంగతి తెలిసిందే. ఆయనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సిన్మాకి ముందు పూరి తీసిన నాలుగైదు సిన్మాలు అట్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. దీనికి తోడు హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవాళ్ళే. అందువల్ల సిన్మాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు లేవు. ఈరోజుల్లో ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సిన్మాకి కీలకం అవుతున్నాయి. అందుకని తన మాస్టర్ బ్రెయిన్కి పని పెట్టారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు కాలేజీ విద్యార్థులకు స్పెషల్ షో వేశారు. ఆయన నిర్మించిన ‘ఫిదా’, ‘శతమానం భవతి’ సినిమాలకు ఇదే విధంగా స్పెషల్ షోలు వేశారు. ఇప్పుడు పూరి సినిమాకు సేమ్ ట్రెండ్ ఫాలో అయ్యారు. ‘మెహబూబా’ టీమ్ అమెరికా వెళ్లి రెండు వారాల పాటు అక్కడ సినిమాను ప్రమోట్ చేయాలనుకోవడంలోనూ ‘దిల్’ రాజు సలహాలు వున్నాయట. ఇదీ ‘దిల్’ రాజు మార్క్ పబ్లిసిటీ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సినిమా మీద నమ్మకంతో రెండు రోజుల ముందు బయట జనాలకు షో వేయాలనుకోవడం ఒక కారణం అయితే… బుధవారం ‘మహానటి’ విడుదల కావడం మరో కారణంగా తెలుస్తోంది. ‘మహానటి’గా ముందుగా అమెరికాలో మంచి టాక్ వచ్చేసింది. ఆ హిట్ హడావుడిలో ‘మెహబూబా’ను ఎక్కడ మర్చిపోతారోనని షో వేశార్ట.