దిశా పటాని దశ మార్చిన బాలీవుడ్ సినిమా…!

మోడల్‌గా ఎంటర్‌ అయి 2013లో ఫెమినా మిస్‌ ఇండియా ఫస్ట్‌ రన్నర్‌ అప్‌గా ఎంపికై, డెయిరీ మిల్క్‌ యాడ్‌తో లక్షల మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్న బ్యూటీ దిశా పటాని. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నటించని దిశా ఫస్ట్‌ టైమ్‌ ‘లోఫర్‌’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పెర్‌ఫార్మెన్స్‌ని యూనిట్‌ అంతా అప్రిషియేట్‌ చేశారు. దిశా పెద్ద హీరోయిన్‌ అయిపోతుందని అంతా అనుకున్నారు. తీరా సినిమా రిలీజ్‌ అయిన తర్వాత సినిమాలో ఆమె క్యారెక్టర్‌ గురించిగానీ, ఆమె పెర్‌ఫార్మెన్స్‌ గురించిగానీ ఎవరూ మాట్లాడలేదు. ఈ సినిమా రిలీజ్‌ అయి నెల దాటుతున్నా టాలీవుడ్‌లోగానీ, కోలీవుడ్‌లోగానీ ఏ సినిమాలోనూ ఆమెను బుక్‌ చేసుకోలేదు. ‘లోఫర్‌’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా తన దశ మార్చలేకపోయిందని తెగ ఫీల్‌ అయిపోతోందట దిశా.

మోడల్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నప్పటికీ బాలీవుడ్‌లో కూడా ఆమెకు అవకాశాలు రాలేదు. కానీ, పూరికి మాత్రం ఆమెలో మంచి పెర్‌ఫార్మర్‌ కనిపించిందట. అందుకే ఏరి కోరి ఆమెను తన సినిమాలో హీరోయిన్‌గా పెట్టుకున్నాడు. ఇప్పుడు దిశా ఒక బాలీవుడ్‌ సినిమాకి సైన్‌ చేసిందట. నీరజ్‌ పాండే దర్శకత్వంలో ఎం.ఎస్‌.ధోని జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ‘ఎం.ఎస్‌.ధోని’ చిత్రంలో ధోనీ మాజీ ప్రియరాలుగా నటించబోతోంది దిశా. మరి ఈ సినిమాతో అయినా బాలీవుడ్‌ దర్శకనిర్మాతల దృష్టిని తనవైపు తిప్పుకోవాలి అనుకుంటోంది దిశా పటాని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close