మీడియా వాచ్ :  టీవీ9 ఉద్యోగులకు దివాళి గిఫ్ట్..!

కరోనాతో అతలాకుతమైన వ్యాపారాల్లో మీడియా కూడా ఒకటి. అన్ని భాషల మీడియాలు నలిగిపోయాయి. ముఖ్యంగా తెలుగు మీడియాకు అయితే ఊపిరి ఆగినంత పనయింది. ఉద్యోగుల తీసివేతలు..జీతాల కోతలు…  జరిగాయి. తగ్గించిన జీతాలు ఇప్పటికీ పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. అయితే క్యాష్ రిచ్ మేనేజ్‌మెంట్‌లు మాత్రం తమ సంస్థలపై ఇలాంటి ఒత్తిడిని తామే భరిస్తున్నారు. అయితే అందరూ కాదు. కొంత మందే. టీవీ9 యాజమాన్యం ఈ విషయంలో ముందంజలో ఉంది. సరిగ్గా జీతాలిస్తే చాలని ఇతర మీడియా సంస్థల సిబ్బంది అనుకుంటూంటే… టీవీ9 యాజమాన్యం అనూహ్యంగా దీపావళి గిఫ్ట్ ఇచ్చేసింది. 

ఉద్యోగులందరికీ.. నిర్ణయించిన పద్దతి ప్రకారం జీతం ఇంక్రిమెంట్ లు పెంచారు.  ఈ మేరకు గ్రూప్ సీఈవో బరున్ దాస్ నుంచి ఉద్యోగులకు మెసెజ్ వచ్చింది. కరోనా కాలంలో ఉద్యోగులందరూ.. మనో ధైర్యంతో పని చేశారని.. బరున్ ప్రశంసించారు. ఆర్థికంగా కష్టమైనా.. ఉద్యోగుల్ని నిరాశపర్చకూడదని  ఇస్తున్నట్లుగా సీఈవో చెబుతున్నారు. అదే సమయంలో ప్రతీ ఏడాది మార్చిలో ఇంక్రిమెంట్లు వేస్తారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది వేయలేదు.  ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో ఏప్రిల్ నుంచి ఇంక్రిమెంట్ ఇస్తున్నారు. అంటే…  బకాయిలు కూడా ఇస్తారన్నమాట.  

ఒక్క ఉద్యోగికి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఉంటే.. తొమ్మిది నెలలకు తొమ్మిది వేలు ఎరియర్స్ ఇస్తారు. మళ్లీ వచ్చే మార్చిలో ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ విషయలోనూ ఆలస్యం కాబోదని…  సీఈవో టీవీ9 ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మొత్తానికి టీవీ9 ఉద్యోగులకు నిజంగానే దీపావళి పండుగ వచ్చినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close