ఆ బిల్లు రెండో సారి వెనక్కి..! ఏపీ పెద్దలకు రాజ్యాంగం బేసిక్స్ తెలియవా..!?

ఓ చట్టం చేయాలంటే ఆషామాషీ కాదు. ప్రభుత్వ పెద్దలకో.. మరొకరికో వచ్చిన ఆలోచనలను పేపర్ పెట్టేసి అసెంబ్లీలో ఆమోదించడం కాదు. దానికి చాలాపెద్ద కసరత్తు ఉంటుది. ఇదంతా అధికారులు పూర్తి చేయాలి. రాజ్యాంగ నిబంధనలు… కేంద్ర చట్టాలు.. ఇలా అన్నింటినీ అనుగుణంగా చట్టం చేయాలి. అప్పుడే చెల్లుతుంది. కానీ ఏపీలో అధికారులకు ఆ స్వేచ్చ కూడా లేదో.. లేకపోతే వారి పేరుతో అధికార పార్టీ నేతలే చట్టాలు చేస్తున్నారో కానీ…అసెంబ్లీలో పాస్ చేసి పంపించిన వాటిని కూడా చెల్లవని కేంద్రం వెనక్కి పంపుతోంది. గతంలో దిశ లాంటి చట్టాలు వెనక్కి వచ్చాయి. ఇప్పుడు.. ల్యాండ్ టైటిల్ బిల్లు కూడా వెనక్కి వచ్చింది. ఈ బిల్లు ఒక్క సారి కాదు రెండు సార్లువెనక్కి వచ్చింది.

ఏపీ సర్కారు 2019లోనే ల్యాండ్‌ టైటిల్‌ బిల్లును తీసుకొచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత కేంద్రం ఈ బిల్లును తిరస్కరించి గత నవంబరులో వెనక్కి పంపించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు-2020(భూమి హక్కు) పేరుతో ఏపీ సర్కార్ ఓ చట్టం చేసింది. ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని.. సవరించాలని కేంద్రం వెనక్కి పంపింది. అయితే మళ్లీ ఆ సవరణలు చేయకుండా డొంక తిరుగుడుగా బిల్లు రూపొందించి పంపారు. దీంతోకేంద్రం నిర్మోహమాటంగా మళ్లీ బిల్లును వెనక్కి పంపేసింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం మూడో సారి బిల్లును అసెంబ్లీలో పెట్టాల్సి ఉంది.ఆ తర్వాత మళ్లీ కేంద్రానికి పంపాల్సి ఉంది. అప్పుడైనా ఆమోదిస్తారా లేదా అన్నది ఉత్కంఠే. ఎందుకంటే ఏపీలో బిల్లులు తయారు చేస్తున్న యంత్రానికి రాజ్యాంగంలో బేసిక్స్ కూడా తెలియని పరిస్థితి ఉందని భావించాల్సి వస్తోంది. నిజానికి ఈ చట్టం కాకుండానే …. ఈ చట్టాన్ని అమలు చేస్తూ.. సర్వే కూడా ప్రారంభఇంచారు. జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే ప్రారంభించారు. మీ భూములకు పట్టాలిస్తామని.. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అసలు చేసిన చట్టమే రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తేలింది.

ల్యాండ్ టైటిల్ చట్టంలో కేంద్రం అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ.. కొన్ని అంశాలను తీసి వేయడానికి ఏపీ సర్కార్ ఆసక్తి వ్యక్తం చేయడం లేదు. విశేషాధికాలను కల్పించుకునే ప్రయత్నం చేయడం.. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న అంశాలను తీసివేయడానికి ఏపీ సర్కార్ ఎందుకు తటపటాయిస్తుందో చాలా మందికి అర్థం కావడం లేదు. ఇప్పటికే ఏపీలో అనేక రకాల దందాలు వెలుగు చూస్తున్నాయి. ఆ చట్టానికి ఆమోదం లభిస్తే.. ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల విషయంలో ఇష్టారీతిన పట్టాలు, ధృవీకరణ పత్రాలు జారీ చేయడం వంటివిచేసి.. అక్రమాల పుట్ట చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన సామాన్యుల్లో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఏపీ సర్కార్‌ పెద్దలకు రాజ్యాంగంపై పెద్దగా అవగాహన లేదని మరోసారి స్పష్టమయిందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close