మీడియా కథనాలపై యాంత్రికంగా ఆంక్షలొద్దు – దిగువ కోర్టులకు సుప్రీం కీలక సూచనలు !

మీడియాలో వచ్చే కథనాలు తమ పరువు నష్టం కలిగిస్తున్నాయంటూ దాఖలైన పటిషన్లపై విచారణ జరిపేటప్పుడు ట్రయల్ కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. యథాలాపంగా ఆ కథనాలను నిషేధించవద్దని.. ఒక వేళ అలా యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే రచయిత, పబ్లిషర్ ప్రాథమిక హక్కుతో పాటు ప్రజలు తెలుసుకునే హక్కును కూడా ప్రభావితం చేసినట్లేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. జీ ఎంటర్ ప్రైజెస్ సంస్థ బ్లూమ్ బెర్గ్ మీడియా సంస్థలో వచ్చిన కథనాన్ని తొలగించాలంటూ కోర్టును ఆశ్రయించడంతో దిగువ కోర్టు ఆ కథనాన్ని తొలగించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై బ్లూమ్ బెర్గ్ మీడియా సుప్రీంకోర్టున ఆశ్రయించడంతో ఆ ఉత్తర్వులను కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు.. దిగువ కోర్టులకు ఈ సూచన చేసింది.

నిజానికి దేశంలో మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాల విషయంలో ఇటీవలి కాలంలో అనేక మంది న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. లీగల్ నోటీసులు అసువుగా ఇచ్చేస్తున్నారు. సుప్రీంకోర్టు తాజా సూచనలు .. ఒక్క వ్యాపారమైన వార్తలకే కాకుండా అన్ని రకాల వార్తలకూ వర్తిస్తాయి. నిజానికి ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా రాజకీయ పరమైన వార్తలు రాసే జర్నలిస్టులు, పత్రికలకు వస్తూంటాయి. దానికి తాజా ఉదాహరణ గత వారం డ్రగ్స్ కేసులో రాజ్ పాకాల అనే వ్యక్తి ఉన్నారని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. అవి అవాస్తవాలంటూ.. పరువు నష్టం అంటూ..ఒక్కో సంస్థపై వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు రాజ్ పాకాల. ఆయన మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది.

నిజానికి రాజ్ పాకాలకు సంబంధించి వచ్చిన కథనాల్లో ఎవరూ ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఎవరూ నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదు. పైగా నిర్ధారణ చేయలేదు. వారికి వచ్చిన సోర్స్ అధారంగా.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను గుర్తు చేస్తూ.. కథనాలు రాశారు. దానికి ఆయన వివరణ ఇస్తే.. ఆయా మీడియా సంస్థలు ప్రచురించేవి. కానీ అలా చేయకుండా నేరుగా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన ఒక్కరే కాదు.. స్వయంగా మీడియాను నడుపుతున్న వారు కూడా ఇలాగే హెచ్చరికలు పంపారు. నమస్తే తెలంగాణ పత్రికలో ఉద్యోగాల్ని తీసేస్తున్నారంటూ కథనాలు రాసిన వారికీ ఇలాంటి నోటీసులే పంపారు ఆ పత్రిక ఓనర్ దామోదర్ రావు.

ఇలాంటి బెదిరింపులు పెరిగిపోతున్న సమయంలో సుప్రీంకోర్టు దిగువ కోర్టులకు ఇచ్చిన సూచనలు.. మీడియా సంస్థలు, జర్నలిస్టులతో పాటు ప్రజల ప్రాథమిక హక్కులను కూడా కాపాడేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close