వరద నష్టం అంచనాకొచ్చారా ? జగన్ పనితీరుకా ?

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను అతలాకుతరం చేసిన వరద పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కలిసింది. అంతకు ముందు మూడు రోజుల పాటు వారు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వీరు కలిసిన తర్వాత ఏపీ సీఎంవో నుంచి ఓ ప్రెస్‌నోట్ రిలీజయింది. ఇందులో వారు ఎంత నష్టం జరిగిందని అంచనా వేశారో క్లారిటీగా చెప్పలేదు.. సీఎం జగన్ పనితీరుకు మాత్రం వందకు వంద మర్కులేసినట్లుగా చెప్పుకున్నారు. వారు అసలు విషయం కన్నా జగన్‌ను పొగడటానికే ఎక్కువ సమయం కేటాయించారన్నట్లుగా ఆ ప్రెస్‌నోట్‌లో ఉంది. వారెవరూ మీడియాతో మాట్లాడలేదు కాబట్టి.. ప్రభుత్వం పంపింది కాబట్టి వారు అలా చెప్పారని కోవాల్సిందే.

జగన్ నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయం, అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారని సామాన్య జనం, రాజకీయ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అందరూ ప్రభుత్వం పనితీరును అద్భుతమన్నారని సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇంత భారీ విపత్తు వస్తే రగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదని కానీ ఇప్పుడు మాత్రం అఘమేఘాలపై చేసేశారని పొగిడేశారు. కలెక్టర్లకు కావాల్సినన్ని నిధులు ఇచ్చారని.. వాటితో పనులు చేశారని కూడా వారు నివేదిక ఇచ్చారట. ఇన్ని పొగడ్తలు కురిపించిన వాళ్లు చివరికి ఏమైనా సాయం చేయాలని నివేదిక ఇస్తారా లేదా అన్నదానిపై క్లారిటీలేదు.

అయితే సీఎం జగన్ మాత్రం తమ దగ్గర విపత్తు నిధులేమీ లేవని.. కోవిడ్‌ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయని ..పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్‌ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని జగన్ కోరారు. తాను రూ. ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని నివేదిక ఇచ్చామని దాని ప్రకారం.. ఇప్పించాలన్నారు. అసలు ఈ బృందం కేంద్రానికి ఇచ్చే నివేదికపైనా ఏదైనా సాయం అందుతుందా లేదా అనేది తేలుతుంది. దాని కంటే ముందు పొగడ్తలతో కడుపు నింపేసి వెళ్లారు సభ్యులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close