బీజేపీని గంట తిట్టి “ధాన్యం భారం” దించేసుకున్న కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించిన తర్వాత అందులో తీసుకున్న నిర్ణయాలపై ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం బీజేపీని తి‌ట్టడానికే ప్రెస్‌మీట్ పెట్టినట్లుగా ఉంది. తన గంటన్న ప్రెస్‌మీట్ సారాంశం మొత్తం సింగిల్ పాయింట్‌లో చెప్పాలంటే.. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. రైతులు ఎవరైనా పండించుకున్నా ఎవరికి వారు అమ్ముకోవాలి. ఇది చెప్పాల్సిన మాట సూటిగా చెప్పారు కానీ.. ఇదంతా బీజేపీ వల్లే అని చెప్పడానికి మిగతా సమయం అంతా కేటాయించారు. బీజేపీని చెడా మడా తిట్టేశారు.

ఢిల్లీకి వెళ్తే బిచ్చగాళ్లలాగా చూస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డిని చేతకాని దద్దమ్మగా అభివర్ణించారు. బీజేపీ రైతు హత్యల ప్రభుత్వంగా మాట్లాడారు. తన ప్రసంగంలో 90 శాతం బీజేపీని విమర్శించడానికే సరిపోయింది. వరి పండించవద్దని అనుకుంటే ప్రత్యామ్నాయ పంటల గురించి ప్రకటించి.. వాటికి మద్దతు ధర ఇస్తే ఎక్కువ మంది పాటిస్తారని అంచనా వేశారు. కానీ కేసీఆర్ తన ప్రెస్మీట్‌లో ప్రత్యామ్నాయ పంటల గురించే చెప్పలేదు. దీంతో రైతుల్లో విస్మయం అవుతుంది. మొత్తంగా చూస్తే వచ్చే యాసంగిలో వరి ధాన్యం కొనే పరిస్థితి లేదు.

ఈ వైఫల్యాన్ని బీజేపీకి అంటించేందుకు శతవిధాలా చేస్తున్న ప్రయత్నాలకు కేసీఆర్ .. ఫినిషింగ్ టచ్ ఇచ్చారనుకోవాలి. కానీ బీజేపీ నేతలు మాత్రం తాను చేయాలనుకున్నది చేస్తున్నారు. ఈ సారి ప్రెస్ మీట్ విశేషం ఏమిటంటే బండి సంజయ్ నుంచి లైట్ తీసుకుని.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం. కేసీఆర్ టార్గెట్ చేయడం ల్ల బండి సంజయ్‌కు ఫోకస్ వచ్చింది. ఈ సారి కిషన్ రెడ్డికి చాన్సిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close