పీవీ కుమార్తెను కేసీఆర్ అగౌరవపరిచారా..!?

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవీని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేయడం… పోటీకి ఆమె అంగీకరించడం తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. నిజానికి ఆమెను ఎమ్మెల్యేల కోటాలో నామినేట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పెద్దగా ఆశల్లేని హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అభ్యర్థిగా నిలబెట్టారు. సురభి వాణిదేవి… రాజకీయాల్లో లేరు. ఆమె విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. అయితే పీవీ నరసింహారావుకు ఎక్కడా లేనంత గౌరవం ఇవ్వాలని నిర్ణయించిన కేసీఆర్.. శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ ఉత్సవాల కమిటీలో సురభి వాణిదేవికి కీలక స్థానం ఇచ్చారు. అంతే కాదు… పీవీకి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఓ వర్గాన్ని అమితంగా ఆకట్టుకోవచ్చన్నలక్ష్యంతో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఆమె కుమార్తెకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. గత ఆగస్టులో గవర్నర్ కోటాలో మూడు స్థానాలు భర్తీ చేశారు. అప్పట్లోనే పీవీ కుమార్తె పేరును టీఆర్ఎస్ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగాపోటీకి నిలబెట్టారు. ఇది పీవీ అభిమానుల్ని కూడా షాక్‌కు గురి చేస్తోంది.

ఉద్యమ వేడి ఉన్నప్పుడే… ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ను ఉద్యోగానికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా పోటీ చేయించారు. కానీ అక్కడ ఓడిపోయారు. అలాంటిది.. ఇప్పుడు వాణిదేవిని ఎందుకు నిలెబట్టాల్సి వచ్చిందనేది వారి సందేహం. పైగా హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి చిన్నారెడ్డి, ఎల్ రమణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి హేమాహేలు పోటీ చేస్తున్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. ఓటింగ్ ప్రయారిటీల్లో పార్టీలు ఉండవు. అయినప్పటికీ కేసీఆర్ వ్యూహాత్మకంగా పీవీ కుమార్తెను రంగంలోకి దింపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close