బీజేపీకి విరాళాల వరదే !

2022-23లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రూ.1300 కోట్ల నిధిని సమకూర్చుకోగలిగింది. అదే సమయంలో కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాల కన్నా ఇది ఏడు రెట్లు ఎక్కువ. 2022 23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.2120కోట్లు కాగా, అందులో 61 శాతం ఎలెక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయని ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిక వెల్లడించింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.1775 కోట్లు. 2021-22 నాటి ఆదాయం రూ.1917 కోట్లు కన్నా 2022-23లో మొత్తం ఆదాయం రూ.2366.8 కోట్ల వరకు అధిగమించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే ఆ పార్టీకి 2021-22లో రూ.236 కోట్లు ఆదాయం రాగా, 2022-23 నాటికి రూ.171కోట్ల వరకు తగ్గింది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు పొందిన సమాజ్‌వాది 2021-22లో ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా రూ.3.2 కోట్ల వరకు విరాళాల మొత్తం ఆదాయాన్ని పొందగలిగినప్పటికీ, 2022-23 నాటికి ఈ బాండ్ల నుంచి ఎలాంటి విరాళాలు పొందలేక పోయింది.

మరో రాష్ట్ర స్థాయి పార్టీ టీడీపీ 2022-23లో రూ.34 కోట్లు ఆర్జించగా, అంతకు ముందు సంవత్సరం కన్నా పది రెట్లు ఎక్కువగానే పొందగలిగింది. వడ్డీల రూపంలో బీజేపీ 2021-22లో రూ.135 కోట్లు పొందగా, 2022-23లో రూ.237 కోట్ల వరకు ఎక్కువగా సాధించగలిగింది. ఎన్నికలు, ప్రచారానికి సంబంధించి విమానాలు, ఎయిర్ క్రాఫ్ సర్వీస్‌ల కోసం 2021-22లో రూ.117.4 కోట్లు బీజేపీ చెల్లించగా, 2022-23లో ఆ సర్వీస్‌ల కోసం కేవలం రూ.78.2 కోట్లు మాత్రమే చెల్లించింది. అంతకు ముందుకన్నా ఈ ఖర్చు బాగా తగ్గింది. బీజేపీ తన అభ్యర్థులకు 2021-22లో రూ.146.4 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించగా, 2022-23లో ఆ సాయం కేవలం రూ.76.5 కోట్లు మాత్రమే పరిమితమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close