కన్నా కోడలు మృతి కేసులో కొత్త అనుమానాలు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య సుహారిక కొద్ది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మిత్రుడు ఇంట్లో జరిగిన ఓ పార్టీలో విపరీతంగా డాన్స్ చేయడం వల్ల ఒక్క సారిగా కింద పడి.. గుండెపోటుతో చనిపోయిందని మీడియాకు సమాచారం ఇచ్చారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సైలెంట్‌గా ఉన్న కన్నా కుమారుడు ఫణీంద్ర .. హఠాత్తుగా… హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లి.. ఆమె మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు ఇచ్చారు. అనేక అనుమానాలను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చనిపోలేదని.. చంపేసి ఉంటారని ప్రధానంగా కన్నా ఫణీంద్ర అనుమానం.

తన అత్తామామలు కేసును తప్పుదోవ పట్టించి, నిజాలు దాస్తున్నారని పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని ఫణీంద్ చెబుతున్నారు. మొదట సీబీఐటీ దగ్గర చనిపోయిందని చెప్పారని.. తర్వాత ఇంట్లో చనిపోయిందని చెప్పారన్నారు. చనిపోయిన రెండు గంటల తర్వాత ఆస్పత్రికి తీసుకు వచ్చారని ఏఐసీ ఆస్పత్రి వర్గాలు సర్టిఫికెట్ ఇచ్చాయని.. ఆమె చనిపోయిన ప్రాంతానికి..ఏఐజీ ఆస్పత్రికి ప్రయాణం పది నిమిషాలు కూడా ఉండదని ఫణీంద్ర చెబుతున్నారు. చనిపోయినప్పుడు మద్యం మత్తులో ఉందని ప్రచారం చేశారు. కానీ, సుహారికకు మద్యం తాగే అలవాటు లేదని ఫణీంద్ర చెబుతున్నారు.

కన్నా ఫణీంద్రది ప్రేమ వివాహం. నెల్లూరు జిల్లాకు చెందిన సుహారికను కన్నా ఫణీంద్ర ప్రేమించి… కులాంతర వివాహం చేసుకున్నారు. దీనికి కన్నా లక్ష్మినారాయణ కూడా అంగీకరించలేదని చెబుతారు. అయితే.. ఫణీంద్ర.. పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని తన జీవితం తాను గడుపుతున్నారు. హఠాత్తుగా.. ఆమె మిత్రుల ఇంటికి వెళ్లి కన్నుమూయడం … కలకలం రేపింది. ఇప్పుడా మృతి మిస్టరీ తేలాలని.. కన్నా కుమారుడు కోరుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close