కన్నా కోడలు మృతి కేసులో కొత్త అనుమానాలు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య సుహారిక కొద్ది రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మిత్రుడు ఇంట్లో జరిగిన ఓ పార్టీలో విపరీతంగా డాన్స్ చేయడం వల్ల ఒక్క సారిగా కింద పడి.. గుండెపోటుతో చనిపోయిందని మీడియాకు సమాచారం ఇచ్చారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సైలెంట్‌గా ఉన్న కన్నా కుమారుడు ఫణీంద్ర .. హఠాత్తుగా… హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లి.. ఆమె మృతిపై అనుమానాలున్నాయని ఫిర్యాదు ఇచ్చారు. అనేక అనుమానాలను తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చనిపోలేదని.. చంపేసి ఉంటారని ప్రధానంగా కన్నా ఫణీంద్ర అనుమానం.

తన అత్తామామలు కేసును తప్పుదోవ పట్టించి, నిజాలు దాస్తున్నారని పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని ఫణీంద్ చెబుతున్నారు. మొదట సీబీఐటీ దగ్గర చనిపోయిందని చెప్పారని.. తర్వాత ఇంట్లో చనిపోయిందని చెప్పారన్నారు. చనిపోయిన రెండు గంటల తర్వాత ఆస్పత్రికి తీసుకు వచ్చారని ఏఐసీ ఆస్పత్రి వర్గాలు సర్టిఫికెట్ ఇచ్చాయని.. ఆమె చనిపోయిన ప్రాంతానికి..ఏఐజీ ఆస్పత్రికి ప్రయాణం పది నిమిషాలు కూడా ఉండదని ఫణీంద్ర చెబుతున్నారు. చనిపోయినప్పుడు మద్యం మత్తులో ఉందని ప్రచారం చేశారు. కానీ, సుహారికకు మద్యం తాగే అలవాటు లేదని ఫణీంద్ర చెబుతున్నారు.

కన్నా ఫణీంద్రది ప్రేమ వివాహం. నెల్లూరు జిల్లాకు చెందిన సుహారికను కన్నా ఫణీంద్ర ప్రేమించి… కులాంతర వివాహం చేసుకున్నారు. దీనికి కన్నా లక్ష్మినారాయణ కూడా అంగీకరించలేదని చెబుతారు. అయితే.. ఫణీంద్ర.. పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని తన జీవితం తాను గడుపుతున్నారు. హఠాత్తుగా.. ఆమె మిత్రుల ఇంటికి వెళ్లి కన్నుమూయడం … కలకలం రేపింది. ఇప్పుడా మృతి మిస్టరీ తేలాలని.. కన్నా కుమారుడు కోరుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close