తాలిబన్లతో బెజవాడ గ్యాంగ్ డ్రగ్స్ బిజినెస్!

ఆప్ఘనిస్థాన్‌ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు విజయవాడకు చెందిన ఓ కంపెనీ టాల్కమ్ పౌడర్ దిగుమతి చేసుకుంది. ఈ కంటెయిన్ వచ్చిన తర్వాత అధికారులు పరిశీలన జరిపితే అది టాల్కమ్ పౌడర్ కాదు.. హెరాయిన్ అని తేలింది. ఆ హెరాయిన్ విలువ రూ. వంద..రెండు వందల కోట్లు కాదు. ఏకంగా రూ. తొమ్మిది వేల కోట్లు. ఈ హెరాయిన్ పరిమాణాన్ని చూసి డీఆర్ఐ అధికారులకే కళ్లు తిరిగిపోయాయి. ఆషీ ట్రేడింగ్ పేరుతో విజయవాడ కంపెనీ ఈ డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటోంది.

ఊరూపేరూ లేనికంపెనీ ఆషి ట్రేడింగ్ అని తేలింది. అక్కడ ప్రత్యేకంగా ఎలాంటి వ్యాపారాలు చేయని సంస్థ. గత ఏడాదే దాన్ని నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. బినామీలు.. తప్పుడు పేర్లు పెట్టి కంపెనీని పెట్టిన దుండగులు ఈ డ్రగ్స్‌ను విజయవాడ కేంద్రంగా దిగుమతి చేసుకుని వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. విజయవాడను ఎందుకు సేఫ్‌జోన్‌గా ఎంచుకున్నారో స్పష్టత రావాల్సి ఉంది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

ఆప్ఘనిస్థాన్‌లో డ్రగ్స్ బిజినెస్ మొత్తం తాలిబన్ల చేతుల్లోనే ఉంటుంది. వారితోనే విజయవాడకు చెందిన గ్యాంగ్ డీల్స్ చేసుకుని ఇలా వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను దేశంలోకి దిగుమతి చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాంటే ఇప్పటి వరకూ ఎంత ఇలా దేశంలోకి డ్రగ్స్‌ను డంప్ చేసి ఉంటారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఆ విజయవాడ గ్యాంగ్‌ను పట్టుకుంటేనే కానీ ఈ రహస్యం బయటకు రాదు. నేరుగా తాలిబన్లతోనే డీల్ చేస్తున్నారంటే అతి సామాన్య మైన విషయం కాదని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close