” సాయం కావాలని ” సినిమా ఫంక్షన్‌లో అడిగితే ప్రభుత్వాలు స్పందిస్తాయా ?

తెలుగు సినీ ఇండస్ట్రీ తీవ్రమైన కష్టాల్లో ఉంది. చిరంజీవి చెప్పినట్లుగా నలుగురు హీరోలు బాగుంటే పరిశ్రమ బాగున్నట్లు కాదు. లక్షల మంది కార్మికులకు రోజువారీ పని దొరకాలి. అందుకే మెగాస్టార్ చిరంజీవి సహకరించాలని ప్రభుత్వాలను కోరారు. అది కూడా సినిమా వేదిక మీద. చిరంజీవికి అంతకు మించిన వేదిక మరేమీ దొరకినట్లుగా లేదు. దాసరి నారాయణరావు తర్వాత టాలీవుడ్‌కు పెద్దగా చిరంజీవి గౌరవం అందుకుంటున్నారు. ఆయనకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల వద్ద మంచి పలుకుబడి ఉంది. అటు జగన్‌తో ఇటు కేసీఆర్‌తో నాగార్జునతో కలిసి వెళ్లి మరీ రెండేసి సార్లు భేటీలు అయ్యారు. అంత సాన్నిహిత్యం ఉన్నా…సినిమా ప్రమోషన్ కోసం పెట్టిన వేదికపై నుంచి సమస్యలను పరిష్కరించాలని కోరడం మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.

సినిమా రంగ సమస్యలు పరిష్కరించాలని .. అందు కోసం టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మాలని చిరంజీవి, నాగార్జున వంటి వారు కోరారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకే తాము జీవో తీసుకొచ్చి.. ప్రత్యేకంగా సినిమా పోర్టల్ ద్వారా టిక్కెట్లు అమ్ముతామని కూడా చెబుతోంది. ఈ అంశంపై చిరంజీవి నాగార్జున కూడా స్పందించలేదు. వారు నిజంగా అలా కోరి ఉంటారని అందుకే స్పందించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా టిక్కెట్లను కూడా ప్రభుత్వమే ‌అమ్మడం సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంలో భాగం అయితే… ఇతర డిమాండ్లను కూడా చిరంజీవి ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న మౌలికంగా వస్తుంది. ఒక వేళ ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా..? అలా పట్టించుకోకపోతే చిరంజీవి ఎందుకు ప్రశ్నించరు అనేది చాలా మందికి వచ్చే డౌట్.

ఇప్పుడు టాలీవుడ్ నిలబడాలంటే రెండురాష్ట్రాల్లోనూ సమాంతరంగా సినిమాలు విడుదల కావాలి. రెండు చోట్ల టిక్కెట్ల రేట్లు.. ఇతర సమస్యలు పరిష్కారం కావాలి. లేకపోతే సినిమాలు బయటపడే పరిస్థితి లేదు. ఓటీటీకి అమ్ముకోవాలి. రేపు ధియేటర్ బిజినెస్ లేదని తేలితే ఓటీటీ వాళ్లు ఎలా ఆడుకుంటారో చిరంజీవి లాంటి వ్యక్తికి తెలియనిది కాదు. కానీ ఆయన తన పలుకుబడిని సినిమా రంగ పరిశ్రమ సమస్య పరిష్కారానికి ఉపయోగించలేకపోతున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతున్నా రిప్లయ్ ఇవ్వలేకపోతున్నారు.

ఎవరు అవునన్నా.. కాదన్నా.. చిరంజీవిపై ఇప్పుడు చాలా పెద్ద భారం ఉంది. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిశ్రమను ఆదుకునేలా ఉపశమన చర్యలు చేపట్టాల్సి ఉంది. ఎందుకనో కానీ ఏపీ ప్రభుత్వం భేటీలు అంటూ ప్రకటిస్తోంది కానీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు. ఓ రకంగా తెలంగాణ ప్రభుత్వంతో ఇబ్బందుల్లేవు. కానీ ఆయన రెండు ప్రభుత్వాలను కలిపి .. సినిమా వేదిక మీద పరిష్కరించాలని కోరారు కాబట్టి ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం నుంచీ ఆయన కొంత సాయం కోరుతున్నారు. అదేమిటో నేరుగా కలిసికోరాలి కానీ సినిమా ఫంక్షన్ల వేదికలపై కోరితే ఎవరూ పట్టించుకోరనేది అందరికీ తెలిసిన వాస్తవం. చిరంజీవికి కూడా తెలిసే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close