లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్‌కు ఈసీ ఎప్పుడు పర్మిషన్ ఇచ్చింది..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాలు మే ఒకటో తేదీన విడుదల చేస్తామన రామ్‌గోపాల్ వర్మ మూడు రోజులుగా హడావుడి చేస్తున్నారు. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి… సినిమా ప్రమోషన్ చేస్తానని.. నిజం చెబుతానని హడావుడి చేశారు. ఆయన చేసిన ప్రకటన…. ఏదో రాజకీయ కుట్ర ఉందన్న కోణంలో ఉండటంతో.. విడయవాడ పోలీసులు ఎన్నికల నిబంధనలు గురించి చెప్పి.. వెనక్కి పంపేశారు. ఆ ఘటన కేంద్రంగా కావాల్సినంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు… రామ్‌గోపాల్ వర్మ. విజయవాడ నుంచి పోలీసులు వెనక్కి పంపిన తర్వాత హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి.. మళ్లీ ఒకటో తేదీన సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారు.

అసలు.. సినిమా విడుదల చేయడానికి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చిందా.. లేదా అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం… కొన్నాళ్ల క్రితమే.. ఓ సర్క్యూలర్ జారీ చేసింది. దాని ప్రకారం.. ఏ రాజకీయ నాయకుడి బయోపిక్ అయినా సరే విడుదల చేయడానికి లేదని.. ఆ సర్క్యూలర్ సారాంశం. దీని ఆధారంగా.. ఏపీ ఎన్నికల సంఘం కూడా.. ఇలాంటి ఆదేశాలను జారీ చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల విషయంపై హైకోర్టులో విచారణ జరిగినప్పుడు… ఈసీ ఇదే సర్క్యులర్‌గా హైకోర్టుకు సమర్పించడంతో… హైకోర్టు విచారణ ముగించింది. ఈసీ ఆదేశాల కారణంగా.. ప్రధాని మోదీ బయోపిక్‌ ‘పీఎం నరేంద్ర మోదీ’ కూడా వాయిదా పడింది. ఎన్నికల కోడ్ మే 23వ తేదీ వరకూ ఉంటుంది. ఆ తర్వాతే.. బయోపిక్ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అయినా… ఇప్పుడు ఎందుకు.. ఒకటో తేదీనే.. విడుదల చేయబోతున్నామని.. ఆర్జీవీతో పాటు.. సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న రాకేష్ రెడ్డి ఎందుకు హడావుడి చేస్తున్నారోనని.. చిత్ర పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై ఈసీ కూడా సైలెంట్ గాఉంది. ఈసీ పర్మిషన్ ఇచ్చిందో లేదో అధికారిక ప్రకటన లేదు. అయితే వైసీపీ నేతలు ఎన్నికల సంఘంతో.. రాసుకు పూసుకు తిరగుతూండటంతో… రహస్యంగా పర్మిషన్ ఇచ్చారేమోనన్న అనుమానాలు.. మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close