రాజగోపాల్ రెడ్డి కంపెనీ నుంచే నేరుగా ఖాతాలకు డబ్బులు !

మునుగోడు ఉపఎన్నికల్లో డబ్బులే కీలకం. తెలంగాణలో ఉన్న అధికార పార్టీకి ఎలాంటి అడ్డంకుల్లేవు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఎక్కడ పైసా కదిలిస్తే అక్కడ దొరికిపోతోంది. చివరికి బైకుల మీద తరలించాలన్నా.. పట్టేసుకుంటున్నారు. ఈ సమాచారం అంతా ఎలా తెలుస్తోందోనని బీజేపీ నేతలు మథనపడుతున్నా…బయటకు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకూ రూ. పదిహేను కోట్లకుపైగా దొరికింది. దీంతో రాజగోపాల్ రెడ్డి.. నేరుగా బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

మునుగోడు ఉపఎన్నికలు రావడానికి కారణం సుశీ ఇన్ ఫ్రా సంస్థకు రూ. పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ రావడమేనని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూంటారు. ఇప్పుడు అదే కంపెనీ నుంచి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న పలువురు నేతలకు రూ. ఐదు కోట్ల కంటే ఎక్కువ నగదు ట్రాన్స్ ఫర్ అయింది. ఈ విషయం ఎలా కనిపెట్టారో కానీ టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో డబ్బులను ఇలా ట్రాన్స్ ఫర్ చేయడానికి కారణం .. ఓటర్లకు పంచడానికేనని.. చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

దీనిపై ఈసీ స్పందించింది. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆ డబ్బులు నియోజకవర్గంలోని వ్యక్తులకు ఎందుకు ట్రాన్స్ ఫర్ చేశారో చెప్పాలని ఆదేశించింది. ఓటర్లకు పంచడానికి అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే రాజగోపాల్ రెడ్డి అలా చెప్పడానికి అమాయకుడేమీ కాదుగా.. వాళ్లు తమ కంపెని సబ్ కాంట్రాక్టర్లు అనో.. మరొకటో చెప్పే చాన్స్ ఉంది. అయితే అసలు నిజం మాత్రం… ఇలా లిక్విడ్ క్యాష్‌ను సరఫరా చేసుకోలేక.. బ్యాంకుల ద్వారా కానిచ్చేస్తున్నారు. బయటపడినా.. పర్వాలేదనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close