సీబీఐ రావాలనుకుంటే ఆ జీవో అడ్డం.. పొడుగు కాదు !

తెలంగాణలో సీబీఐకు జనరల్ కన్సెంట్ రద్దు చేశారు. నిజానికి మూడు నెలల కిందటే జీవో ఇచ్చారు. ఇప్పుడు బయట పెట్టారు. కానీ సీబీఐ అధికారులు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలో సోదాలు చేశారు . ఆ జీవో ఇచ్చిన తర్వాతనే బోయినపల్లి అభిషేక్‌ను అరెస్ట్ కూడా చేసి తీసుకెళ్లారు. అప్పట్లో బయట పెట్టని జీవోను ఇప్పుడు బయట పెట్టారు. దీనికి కారణం.. ఆ జీవో సీబీఐని ఏ విధంగానూ అడ్డుకోలేదని తెలియడమే.

ఢిల్లీలో నమోదైన కేసుల విచారణను రాష్ట్రాల్లో చేయాల్సి వస్తే అలాంటి విచారణను ప్రస్తుతం తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు ఆపలేవు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసు కూడా అక్కడే నమోదైంది. అందుకే తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినా పెద్దగా ప్రభావం ఉండదు. రాష్ట్రాలు తమ సమ్మతి ఉపసంహరించుకున్నంత మాత్రాన సీబీఐ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టడం ఆపలేరు. కోర్టులు ఆదేశిస్తే… దర్యాప్తు చేయవచ్చు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డుకోలేదు.

తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో వల్ల ఎవరికి ఎక్కువ లాభం అంటే.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేసే ఉ్దయోగులకు. తెలంగాణలో ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో అవినీతి జరిగిందని సమాచారం సీబీఐకి అందితే… కేసు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర వివరాలు పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణలో ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వీటన్నింటిపై సీబీఐ కేసులు నమోదు చేయాలంటే ప్రతి కేసుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వస్తుంది.

అదే సమయంలో రాజకీయ పరమైన కేసుల విచారణకు సీబీఐ కోర్టుకెళ్లి ఎన్నో సార్లు జీవోలను కొట్టి వేయించింది . లాలూ ప్రసాద్ యాదవ్‌ , హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎంగా పనిచేసిన వీరభద్రసింగ్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మధుకోడా లు ఇలాగే జీవోలు జారీ చేశారు కానీ.. కోర్టు కొట్టి వేసింది.జనరల్ కన్సెంట్ రద్దు చేయడం ద్వారా సీబీఐకి కొన్ని పరిమితులు పెట్టగలిగినప్పటికీ.. ఇలాంటి దాడులు, అరెస్టులు చేయాలనుకుంటే ఈడీకి ఎలాంటి అనుమతులు అవసరం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close