యువతిని చంపిన ప్రేమోన్మాది..! బెజవాడలో మళ్లీ రక్తచరిత్ర..!

విజయవాడ నెత్తురోడుతోంది. శాంతిభద్రతల ఆచూకీ మచ్చుకైనా కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. నాటుతుపాకీలతో హత్యల దగ్గర్నుంచి ప్రేమించలేదని అమ్మాయిల్ని నరికి చంపడం వరకు యథేచ్చగా సాగిపోతున్నాయి. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజుపురంలో దివ్య తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థినిని ..ప్రేమోన్మాది గొంతు కోసి చంపేశాడు. కార్పెంటర్‌గా పని చేసే నాగేంద్రబాబు.. దివ్యతేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థినిని ప్రేమించాడు. అయితే అది వన్ సైడ్ లవ్. తననుకూడా ప్రేమించాలని వెంటపడ్డాడు. ఆ యువతి తిరస్కరించడంతో వేధించడం ప్రారంభించాడు. చివరికి తనకు దక్కకుండా పోతుందన్న ఉద్దేశంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

కత్తి తీసుకుని నేరుగా ఇంటికి వెళ్లాడు. మాట్లాడాలని పిలిచి గొంతుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ యువతి మృతి చెందింది. దాడి తర్వాత కత్తితో తనను తాను గాయపర్చుకున్నాడు. అయితే జనం కొట్టి చంపుతారన్న ఉద్దేశంతో స్వల్పంగానే గాయపరుచుకున్నాడు. దాంతో ఆ ఉన్మాదిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బెజవాడలో వరుసగా జరుగుతున్న ఘటనలు అన్నీ పోలీసుల నిర్లక్ష్యంతోనే సాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ్యాంగ్ వార్‌లు..అమ్మాయిల హత్యలు కామన్‌గా మారిపోయిన విధానం.. నేరస్తుల్ని పట్టుకుని గట్టిగా శిక్షించలేని దైన్యం పోలీసులకు ఏర్పడింది. ప్రతీ ఒక్క నేరస్తుడు రాజకీయ ప్రాబల్యంతో జబర్దస్తీ చేస్తూండటంతో పోలీసులు కూడా.. నిస్సహాయంగా మారిపోతున్నారు. ఈ పరిస్థితి నేరగాళ్లలో భయం తగ్గడానికి కారణం అవుతోంది. నేరాలు పెరిగిపోవడానికి కారణం అవుతోంది. ఘటనలు జరిగినప్పుడు హడావుడిగా ప్రభుత్వ తరపున కొంత మంది బాధితుల్ని పరామర్శించి వెళ్తున్నారు. పోలీసులు గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. తర్వాత షరా మామూలుగా అయిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close