హైదరాబాద్ అభివృద్ధికి రూ.83,000 కోట్లు కావాలి: కె.టి.ఆర్.

హైదరాబాద్ ని అతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి నగరంలో ఎక్స్ ప్రెస్ హైవేలు, ఎలివేటడ్ హైవేలు, హుస్సేన్ సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు వగైర నిర్మిస్తామని తెరాస ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది. వాటిలో బహుళ అంతస్తుల భవనాల ఊసు ఇప్పుడు ఎత్తడం లేదు కానీ హైవేల నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు మునిసిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్. శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా జవాబు చెప్పారు. వాటి కోసం సుమారు రూ. 83,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు కె.టి.ఆర్. చెప్పారు. ఈ పనుల కోసం ఇప్పటికే 19 సంస్థలతో చర్చించామని తెలిపారు. ఈ ప్రాజెక్టులను నిర్మించేందుకు ఈ.పి.సి., బి.ఓ.టి., డి.బి.ఎఫ్.ఓ.టి. వంటి విధానాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వాటిలో ప్రభుత్వానికి, సదరు నిర్మాణ సంస్థలకి ఏది ఆమోదయోగ్యంగా ఉంటే దానిని అమలుచేయాలనుకొంటున్నట్లు మంత్రి చెప్పారు. ఆ సంస్థలు తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇంకా అందజేయలేదని, అవి తమ చేతికి రాగానే అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరికీ వాటి వివరాలను తెలియజేస్తామని మంత్రి కె.టి.ఆర్. చెప్పారు. రూ.19,222 కోట్లు వ్యయం అయ్యే ఈ పనులలో కొన్నిటిని నాలుగు దశలలో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర విభజన జరిగేనాటికే హైదరాబాద్ అన్ని విధాల చాలా అభివృద్ధి చెంది ఉందని అద్నరికీ తెలుసు. తెరాస ప్రభుత్వం చేపట్టబోయే ఈ అభివృద్ధి పనులు కూడా పూర్తయినట్లయితే నాలుగు ప్రధాన మెట్రో నగరాలతో సమానంగా నిలుస్తుంది. అయితే దీని కోసం నిధుల సమీకరణ చేయడమే పెద్ద సమస్య. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రూ.1.25 కోట్లు అవసరమని అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంత భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేయలేకనే స్విస్ ఛాలెంజ్ విధానంలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. కానీ అది కూడా చాలా కష్టంగానే ఉంది. హైదరాబాద్ నగర అభివృద్ధికి కూడా దాదాపు అదే స్థాయిలో భారీగా నిధులు సమకూర్చుకోవలసి ఉంటుంది. తెరాస ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించగలిగినట్లయితే ఇంక హైదరాబాద్ నగరానికి తిరుగుఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close