బీజేపీలో చేరికల బాధ్యతలు ఈటల రాజేందర్‌కు !

భారతీయజనతా పార్టీలో చేరికల సమన్వయ కమిటీ బాధ్యతలను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అప్పగించారు. ఈమేరకు కమిటీ కన్వీనర్ గా ఆయనను నియమించారు. పార్టీ అగ్రనేతల పర్యటనలు అయిపోగానే ఈటలకు పదవి ఇచ్చారు. కొంత కాలంగా తెలంగాణ బీజేపీలో ఈటలకు కీలక బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు చేరికలను చూసుకునే బాధ్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే పార్టీలో ప్రాధాన్యం లేదని భావిస్తున్న సీనియర్లు ఏపీ జితేందర్ రెడ్డి , గరికపాటి మోహన్ రావు, చాడ సురేశ్ రెడ్డి వంటి వారికి కూడా ఓ కమిటీ ఇచ్చారు.

బీజేపీకి పెద్ద ఎత్తువ హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. కానీ పార్టీలో చేరే వారు మాత్రం తక్కువగా ఉన్నారు. ఈటల మాత్రమే కొంత మందిని అతి కష్టం మీద బీజేపీలో చేర్పించగలిగారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేరిక వెనుక కూడా ఈటల కీలకంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. మరో వైపు కాంగ్రెస్‌లో చేరే వారు పెరుగుతున్నారు. చేరికలు సెంటిమెంట్‌ను పెంచుతాయి. అందుకే.. చేరికల్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

0ష్ట్రం మొత్తం మీద ఈటలకు పట్టుంది. ఉద్యమకారుల్లో ఆయనకు ఎంతో పేరుంది. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న వారిని గుర్తించి పార్టీలో చేర్చడంలో కీలక పాత్ర పోషించాలని ఈటలకు ఈ బాధ్యతలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంలో ఈటల హైకమాండ్ మెప్పు పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. దూకుడును మరింత పెంచి భారీ స్థాయిలో నేతలను బీజేపీలోకి చేర్చుకునేలా ప్లాన్ చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close