గ్రేట్.. జీతంలో కోతపెట్టినా చప్పట్లు కొట్టించుకున్న సీఎం జగన్ !

సీఎం జగన్ స్టైల్ వేరు. ఆయన సమస్యలను డీల్ చేసే విధానం వేరు. ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి దాన్ని కూడా పథకంగా ప్రవేశ పెట్టగలిగే నేర్పరితనం ఆయన సొంతం. ఎవరితో ఎలా రాజకీయాలు చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఉద్యోగుల విషయంలోనూ అదే నిజమైంది. ఉద్యోగులంటనే పనులు చేయకుండా గొంతెమ్మ కోరికలు కోరుతూ ప్రభుత్వాన్ని చికాకు పెడుతూంటారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు వారికి అలాంటి చాన్స్ ఇవ్వలేదు. పైగా జీతం తగ్గించేసి… చప్పట్లు కూడా కొట్టించేసుకున్నారు సీఎం జగన్.

ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ వల్ల జీతం తగ్గబోతోంది. రూ. 80వేల వరకూ అన్ని రకాల అలవెన్స్‌లతో జీతం పొందుతున్న వారికి వచ్చే నెల నుంచి రూ. రెండు నుంచి మూడు వేల వరకూ జీతం కోత పడబోతోంది. ఇంకా తక్కువ జీతం ఉన్న వారికి రూ. రెండు వేల వరకూ జీతం తగ్గబోతోంది. ఈ విషయం పీఆర్సీ ప్రకటించిన వెంటనే అందరికీ అర్థం అయిపోయింది. అయితే సీఎం జగన్ పెండింగ్‌లో ఉన్న డీఏలు అన్నింటినీ జనవరితో కలిపి ఇస్తామని ప్రకటించారు. అవి పది డీఏలుగా ఉన్నాయి. వాటన్నింటినీ ఇస్తే.. కోతపడే జీతం కవర్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు.. ఒకటి.. రెండు వేలు కూడా పెరుగుతాయి. దీంతో జీతం పెరిగిందన్న సంతృప్తి ఉద్యోగులకు ఉంటుంది.

డీఏలు టైమ్లీగా ఇవ్వకుండా ఆపేసి.. ఇప్పుడు జీతంలో కోత పెట్టి.. ఆ కోతను సర్దుబాటు చేయడానికి ఈ డీఏలను వాడుకున్నారని ఉద్యోగు సంఘాల నేతలందరికీ తెలుసు. కానీ ఎవరూ నోరెత్తలేదు. పైగా సీఎం ఆ ప్రకటన చేయగానే చప్పట్లుకొట్టారు. బయటకు వచ్చి.. సంతృప్తి ప్రకటించారు. అంతేనా.. తమ పోరాటం వల్లే ఈ మాత్రం పీఆర్సీ వచ్చిందన్నారు. వీరికి ఆ మాత్రం భయభక్తులు ప్రభుత్వాలపై ఉండాల్సిందేనని.. లేకపోతే నెత్తికెక్కుతారని సామాన్య ప్రజల అభిప్రాయం. ఈ విషయంలో సీఎం జగన్ కరెక్ట్‌గానే వ్యవహారించారు. వారిని ఎలా కంట్రోల్‌లో ఉంచాలో అలా ఉంచారు. జీతం తగ్గించినా నోరెత్తకుండా చప్పట్లు కొట్టించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close