బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్‌బుక్ నిషేధం..!

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్‌బుక్ నిషేధం వించింది. ఆయన జాతి విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నకారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఫేస్ బుక్ ప్రకటించింది. కొద్ది రోజుల కిందట.. అంతర్జాతీయ పత్రిక అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ భారత్‌లో ఫేస్‌బుక్… తన అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా… భారతీయ జనతా పార్టీ నేతల హేట్ స్పీచ్‌లు వైరల్ అయ్యేలా చేస్తోందని.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని… కథనం ప్రచురించింది. దానికి కారణం బీజేపీ అంటే ఫేస్‌బుక్ భయడటమే కారణం అని వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషించింది. ఆ కథనంలో ఎక్కువగా రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు.. ఫేస్ బుక్ పోస్టులనే ఉదాహరణగా చూపించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంతో.. జాతీయంగా దుమారం రేగింది.

సోషల్ మీడియాను అధికారంతో బెదిరించి.. ప్రజల మధ్య విద్వేషాలు పెట్టి రాజకీయ లాభం పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దానికి వాల్ స్ట్రీట్ జర్నల్ కథనమే నిదర్శమని చెప్పడం ప్రారంభించారు. రాహుల్ గాంధీ కూడా.. అవే విమర్శలు చేశారు. అదే సమయంలో…పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న శశిధరూర్.. విచారణ కోసం.. ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చశారు. ఫేస్‌బుక్ కూడా.. ఈ ఆరోపణల్ని ఖండించింది. విద్వేష ప్రసంగాల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రమాణాలు అనుసరిస్తున్నామో.. ఇండియాలో కూడా అంతే వ్యవహరిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు మాత్రం రాజాసింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది.

ఎమ్మెల్యే రాజాసింగ్ సహజంగానే కరుడు గట్టిన హిందూత్వ వాది. ఆయన ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే హిందూత్వ వాదం అనుకుంటారు. దానికి తగ్గట్లుగానే ఆయన సోషల్ మీడియా పోస్టులు ఉండేవి. ఇప్పుడు వివాదం అయ్యే సరికి.. తనకు ఫేస్ బుక్ ఖాతా లేదని… తన ఖాతా మూడేళ్ల కిందట హ్యా‌క్ అయిందని… చెబుతున్నారు. తన పేరుపై ఇతరులు ఖాతా నిర్వహిస్తున్నారని ఆయనంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close