ఢిల్లీలో బుగ్గన – అప్పులు దొరికితేనే జీతాలు, పెన్షన్లు !

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను తీసుకుని ఢిల్లీ వెళ్లారు. నిర్మలా సీతారామన్‌ను కలిసి.. ఇప్పటికిప్పుడు ఆర్బీఐ నుంచి అప్పులు ఇప్పించకపోతే.. జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేరమని మొర పెట్టుకోనున్నారు. ఆర్బీఐ నుంచి పర్మిషన్ ఇస్తే.. మంగళవారం బాండ్లు వేలం వేసి కాస్త ఆలస్యంగా అయినా జీతాలిచ్చుకుంటామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పుల పరిమితి ఇప్పటికే ముగిసిపోయింది. ఇంకా చెప్పాలంటే రకరకాల పద్దులు చూపించి ఇంకా ఎక్కువ తీసుకున్నారు.

అందుకే కేంద్ర ఆర్థిక శాఖ అదనపు అప్పుల కోసం పర్మిషన్ ఇవ్వడం లేదు. ఓ వైపు తెలంగాణ సర్కార్‌పై పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టింది. ఆ ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ. ఇరవై వేల కోట్ల అప్పలకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఏపీకి మాత్రం దాదాపుగా యాభై వేల కోట్లు అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడమే కాదు.. ఆర్బీఐ నుంచి తెచ్చుకునేలా సహకరించారు. ఇక ముందు తెలంగాణకు అప్పు ఇచ్చేఅవకాశం లేదు. కానీ ఏపీ మాత్రం ఇంకా అప్పుల కోసం వెంట పడుతోంది. ఇవ్వాలని బతిమాలుకుటోంది.

బీజేపీతో.. కేంద్రంతో.. వైసీపీ ఎప్పుడూ ఘర్షణాత్మక వైఖరికి వైసీపీ వెళ్లలేదు. ఇటీవల విశాఖ టూర్‌కు మోదీ వస్తే మొత్తం తమ మీద వేసుకున్నారు. సార్.. సార్.. అంటూ జగన్ ఏపీకి ఇచ్చే ప్రతీ పైసా అభివృద్ధికే వెచ్చిస్తామని చెప్పుకొచ్చారు. అయితే అప్పులకు అనుమతిలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఒకే విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రమూ చేయనంత అప్పును ఏపీ చేసేసింది. అయినా అదనపు అప్పులకు పర్మిషన్ ఇస్తే.. అది ఏపిని మరింతగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకునేలా చేయడం తప్ప మరొకటి కాదన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close