పులివెందుల యూరేనియం ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!

కడప జిల్లా పులివెందుల సమీపంలో ఉన్న తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. కంట్రోల్ చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు . యూరేనియం అనేది అత్యంత సున్నితమైన.. ప్రమాదకరమైనది కావడంతో… చుట్టుపక్కల గ్రామల ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అ ప్లాంట్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున కాలుష్యం విడుదల చేస్తుందన్న కారణంగా.. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఆ ప్లాంట్ విడుదల చేస్తున్న వ్యర్థాల వల్ల కొన్ని వందల ఎకరాల్లో పంటలు పండటం లేదు. అదే సమయంలో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోగాల పాలవుతున్నారు. ఈ పరిశ్రమ వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం… నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేక సార్లు విమర్శల పాలయింది.

యురేనియం ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అగ్నిప్రమాదంలో యూరేనియం ఏమైనా గాల్లో కలిస్తే.. తీవ్రమైన సమస్యలు ఉంటాయని భయపడుతున్నారు. తుమ్మలపల్లె వద్ద 2008లో యూసీఐఎల్ యురేనియం శుద్ధికర్మాగారాన్ని నిర్మించింది. అది కేంద్ర ప్రభుత్వానికి చెందినదే. అప్పట్లో.. దేశంలో ఏ రాష్ట్రం కూడా.. ఈ యూరేనియం పరిశ్రమ తమ రాష్ట్రంలో పెట్టడానికి అంగీకరించలేదు. అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ హైకమాండ్‌కు భరోసా ఇచ్చిపులివెందులకు పరిశ్రమను తీసుకొచ్చారు. రోజుకు ప్రస్తుతం ఉన్న శుద్ధికర్మాగారం 3250 టన్నుల ముడి యురేనియాన్ని శుద్ధి చేస్తోంది. ఇటీవల రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు.

ఇటీవలి కాలంలో యూరేనియం గనుల కోసం .. తవ్వకాలు కూడా ప్రారంభించారు. నల్లమల తీరంలోని రుద్రవరం, ఆళ్లగడ్డ, నంద్యాల, మహానంది మండలాల్లో సర్వే చేశారు. తవ్వకాలు కూడా ప్రారంభించారు. అప్పట్లో భూమా అఖిలప్రియ.. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి.. తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత తవ్వకాలు ఆగిపోయాయి. ఈ ప్రమాదం కారణంగా ఇప్పుడు మళ్లీ యూరేనియం పరిశ్రమ వార్తల్లోకి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close