రెండు రోజుల్లోనే “కుట్ర కోణం” కనిపెట్టిన డీజీపీ..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆలయాలపై జరుగుతున్న దాడుల దర్యాప్తు విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల్లో కుట్రకోణం లేదని.. దొంగలు, నిధి వేటగాళ్లు, మూఢ నమ్మకాలు, ఆస్తి గొడవలు, పిచ్చివాళ్లు, అడవి జంతువులు కారణమని చెప్పుకొచ్చారు. అరెస్ట్ చేసిన వారిలో అంతర్రాష్ట్ర ముఠాలు కూడా ఉన్నాయన్నారు. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. వివిధ ఘటనలు జరిగిన కారణాల్ని కూడా వెల్లడించారు. అయితే.. రెండు రోజులు గడిచే సరికి.. పండగ పూట మీడియాతో మాట్లాడి.. కుట్ర కోణాల్ని ఆవిష్కరించారు.

వివిధ ఆలయాలపై జరిగిన 9 ఘటనలకు సంబంధించి పలు రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని కొత్తగా చెప్పుకొచ్చారు. ప్రతీ ఘటన తర్వాత సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని కూడా చెప్పుకొచ్చారు. 21 మంది రాజకీయ పార్టీల కార్యకర్తలకు ప్రమేయం ఉన్నట్లు తేలిందని ఈ వ్యవహారాలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రచారంపైనే డీజీపీ ఎక్కువ కోపంగా ఉన్నారు. అదంతా రాజకీయ పార్టీల కుట్రని చెబుతున్నారు.

ఓ వైపు అధికార పార్టీ పూర్తిగా ఆలయాలపై దాడులను విపక్షాలు చేస్తున్న కుట్రగా చెబుతోంది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా… టీడీపీ, బీజేపీల పనేనని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో డీజీపీ మొదట ఎలాంటి కుట్రలు లేవని చెప్పడం.. తర్వాత రాజకీయ పార్టీల హస్తం ఉందని మాట మార్చడం … రాజకీయ ఒత్తిడుల వల్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎలాగోలా.. విమర్శలు చేయకుండా… విపక్షాలను ఆత్మరక్షణలో పడేయాలంటే.. వారిపై కేసులు బనాయించక తప్పదన్న వ్యూహంలో ఉన్నట్లుగా విపక్షాలు అనుమానిస్తున్నాయి. రామతీర్థం ఘటనలో పట్టుబట్టి టీడీపీ నేతల్నే అనుమానితులుగా తీసుకుని వేధించడాన్ని దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close