కోట్లలో ఆదాయం, గ్యాస్ సబ్సిడీ కావాంటున్న మాజీ సీఎం

ఓ మాజీ ముఖ్యమంత్రి కక్కుర్తి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోట్ల ఆస్తులుండీ ఇదేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ సబ్సిడీకోసం దరఖాస్తు చేయడం వివాదాస్పదమైంది. సబ్సిడీ లేని వంట గ్యాస్ కొనగలిగే స్తోమత ఉన్న వారు సబ్సిడీని వదులుకోండని ప్రధాని నరేంద్ర మోడీ కోరుతున్నారు. అర్హులైన వారికి సబ్సిడీ గ్యాస్ అందించడానికి సహకరించాలని విన్నవిస్తున్నారు. దీనికి స్పందించి దాదాపు 10 లక్షల మంది వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు గ్యాస్ సబ్సిడీ గ్యాస్ ను వదులుకున్నారు.

జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కోటీశ్వరుడు. ఆయన తండ్రి ఆ రాష్ట్రంలో తిరుగలేని నాయకుడిగా ఉన్నారు. చాలా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. తండ్రి స్థాపించిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పాటు, కొన్నేళ్ల పాటు సీఎం పదవిని కూడా ఫరూక్ అనుభవించారు. తర్వాత ఆయన కుమారుడు కూడా మొన్నటి వరకు సీఎంగా ఉన్నారు. ఇలా తరతరాలుగా రాజకీయంగా అన్ని రకాలుగా ఓ వెలుగు వెలిగారు.

ఇప్పుడు ఆయన నాన్ ఆధార్ బేస్ డ్ గ్యాస్ సబ్సిడీ కనెక్షన్ ట్రాన్స్ ఫర్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన సబ్సిడీ వద్దంటారని అనుకుంటే దానికి భిన్నంగా స్పందించారు. దుర్గానాగ్ లోని హెచ్ పి గ్యాస్ డీలర్ కు ఆగస్టు 14న ఈ దరఖాస్తు ఇచ్చారట. మొన్న లోక్ సభ ఎన్నికల సమయంలో ఆయన స్వయంగా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 13కోట్లకు పైనే. ఏడాదికి తన ఆదాయం 10 లక్షలకు పైనే అని తెలిపారు. అంటే నెలకు దాదాపు లక్ష రూపాయలు. అలాంటి వ్యక్తి గ్యాస్ సబ్సిడీ అడగటం సంచలనం కలిగించింది.

ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పీడీపీ నాయకుడొకరు ఫరూక్ పై వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆయన అంద గరీబు అయితే తాము ఆరేళ్ల పాటు ఫ్రీగా గ్యాస్ సరఫరా చేస్తామని ఎద్దేవా చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీ వెళ్లి లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు ఇచ్చిన సీఐడీ !

ఏపీసీఐడీ అధికారులు ఢిల్లీలో మరోసారి తమ పరువు తీసుకున్నారు. 41A నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చి ...ముందుగా వాట్సాప్‌లో నోటీసులు పంపారు. అందుకున్నానని లోకేష్ రిప్లై ఇచ్చాక మళ్లీ.....

వారాహి యాత్రకు టీడీపీ క్యాడర్ కూడా !

జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన...

ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించలేకపోయారు – కేసీఆర్ సాధిస్తారు : కేటీఆర్

ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప అని చెప్పుకోవడానికి కేటీఆర్ తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. మరోసారి అదే పని చేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మాత్రం మిస్ పైర్ అవుతూ ఉంటాయి....

రివ్యూ : కుమారి శ్రీమతి (అమెజాన్ వెబ్ సిరిస్)

కుటుంబకథా నేపధ్యంలో వెబ్ సిరిస్ చేసి అందరిని మెప్పించడం.. మిగతా జోనర్స్ కంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ మలుపులతో, మెస్మరైజ్ చేసే ఎలిమెంట్స్ తో సంచలనాలు సృష్టించేసి, రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close