టైగర్ మెమన్ అరెస్ట్..ఇది వార్తేనా ?

బొంబాయి వరుసపేలుళ్ల సూత్రధారి టైగర్ మెమన్ పాకిస్తాన్ లో అరెస్టయ్యాడంటూ భారతీయ ఛానెళ్లలో బుధవారంనాడు అదేపనిగా వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో (ట్విట్టర్)లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని మీడియా తొందరపడిపోయింది. నిజానిజాలు తెలుసుకోకుండా 1993 బొంబాయి వరుసపేలుళ్ల కేసులో నిందితుడైన యాకుబ్ మెమన్ కు సోదరుడైన టైగర్ మెమన్ ని పాకిస్తాన్ లో అరెస్ట్ చేశారంటూ వార్తాకథనాలు దులిపేశాయి. యాకుబ్ మెమన్ ను ఉరితీసినప్పటికీ ఈ కేసులో ప్రధానసూత్రధారి టైగర్ మెమన్ కావడంతో అతణ్ణి రప్పించడానికి భారత్ ప్రయత్నిస్తునేఉంది. అతను పాకిస్తాన్ లో ఉన్నట్టు తేలినా, పాక్ ప్రభుత్వంమాత్రం ఉలుకూపలుకూలేకుండా ఉండిపోయింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు పాక్ పోలీసులు టైగర్ మెమన్ ను కరాచీలో అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో కబురు రావడంతో చాలామంది హర్షం వెలుబుచ్చారు. 1993నాటి బొంబాయి వరుస పేలుళ్లలో 257మంది ప్రాణాలుకోల్పోయారు. ఏడువందల మందికిపైగానే గాయపడ్డారు. ఈ పేలుళ్లకు సూత్రధారిగా టైగర్ మెమన్ వ్యవహరించినట్టు విచారణలో తేలింది. అలాంటి టైగర్ మెమన్ ను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారనగానే భారతీయులకు ఆనందం కలగడం సహజమే. సోషల్ మీడియాలో కామెంట్స్ స్ప్రెడ్ అయ్యాయి. అతనికి కఠినశిక్ష విధించాలని కూడా ట్వీట్ చేశారు. జియో న్యూస్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఉర్దూ భాషలో ట్వీట్ చేస్తూ – టైగర్ మెమన్ కరాచీలో అరెస్ట్ అయ్యాడని పేర్కొంది. అంతే ఈ వార్త కారుచిచ్చులా ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది.

పాకిస్తాన్ లోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్.ఐ.ఏ) బుధవారం మధ్యాహ్నం టైగర్ మెమన్ ను అరెస్ట్ చేసినట్టు తెలియగానే నెట్ జెన్స్ క్షణాల్లో ఈ వార్తను వైరల్ గా స్ప్రెడ్ చేశారు. కరాచీలోని సైబర్ కేఫ్ దగ్గర జరిగిన దాడిలో టైగర్ మెమన్ ను అరెస్ట్ చేశారని ట్వీట్స్ వచ్చేశాయి. టైగర్ మెమన్ ను అరెస్ట్ చేసి పాకిస్తాన్ ప్రభుత్వం మంచిపనిచేసిందని కూడా సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానించినవారున్నారు. మోదీ తెచ్చిన ఒత్తిడి పాక్ మీద పడిందని మరికొంతమంది విశ్లేషించారు. కరడుగట్టిన నేరస్థుడు దొరకడంతో అంతా సంబరపడుతుంటే, పాక్ అధికారులు ఈ సంతోషపు పొంగుపై నీళ్లుజల్లారు.

ఇంతకీ పట్టుబడిన ఈ టైగర్ మెమన్, మనమంతా కోరుకుంటున్న టైగర్ మెమన్ ఒకరుకారట. ఫుర్ఖన్ అలియస్ టైగర్ మెమన్ ను అరెస్ట్ చేశామని ఎఫ్.ఐఏ చల్లగా సెలవిచ్చింది. ఈ సదరు నిందితుడు ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్లు తెరిచి అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడట. పైగా తాను రియల్ టైగర్ మెమన్ ని అంటూ బెదరిస్తుంటాడట. ఇవన్నీ గమనించకుండానే మనదేశ మీడియా కూడా చెలరేగిపోయింది. ఉగ్రవాద చర్యలకు వ్యూహరచన చేసిన టైగర్ మెమన్ అరెస్టయ్యాడంటూ ఊదరగొట్టేసింది.

సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ వార్తకాదన్న సత్యం ఇప్పటికైనా గౌరవ మీడియా గుర్తిస్తే మంచిది. లేకపోతే మీడియాపట్ల గౌరవం మంటగలిసిపోవడంఖాయం. టీఆర్పీ రేటింగ్ మత్తులోపడిపోయిన టీవీ ఛానెళ్లు ఏదివార్తో, ఏది కాదో కూడా తెలుసుకోకుండా హడావుడిగా వార్తలను ప్రసారంచేయడంతో ఇలాంటి చిక్కులను కొనితెచ్చుకుంటోంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close