జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.. పుంఖాను పుంఖాలుగా కథనాలు రాసేస్తోంది. అవతలి వ్యక్తి రెస్పాండ్ అయితే ఎంత డ్యామేజ్ జరుగుతుందో ఊహించడం లేదు. ముందు బురద చల్లడమే పనిగా పెట్టుకుంది.

తాజాగా సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు వైసీపీపై ఫైరయ్యేలా కథనాలు ప్రసారం చేశారు. ఇటీవల హైదరాబాద్ లో మాజీ సీఈసీ వీఎస్ సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఆ సమావేశంలో ఏపీ ఎన్నికలను పరిశీలించడానికి ఎలక్షన్ వాచ్ ఒకటి ఉండాలన్నారు. ఆ సమావేశంలో నాగేశ్వరరావు కూడా పాల్గొనడతో ఆయన అవినీతి పరుడు అంటూ సాక్షిలో కథనాలు రాశారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని… తనపై చేసిన ఆరోపణలకు తగ్గట్లుగా కేంద్రం హోంశాఖ వద్ద ఉన్న ఆస్తుల జాబితా కన్నా తన వద్ద ఎక్కువ ఉంటే సాక్షికే దానమిచ్చేస్తానని ప్రకటించారు.

అవినీతి కూపంలో కూరుకుపోయిన వారికి, నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులు అతిపెద్ద శత్రువులు. ఎందుకంటే నిజాయితీపరుల ఉనికి వారి అవినీతిని ఎత్తిచూపుతుంది. కాబట్టి, వారు తమ అవినీతిని కప్పిపుచ్చుకునే వ్యర్థ ప్రయత్నంలో నిజాయితీపరులపై ఎప్పుడూ బురద చల్లుతుంటారని మండిపడ్డారు. నిజానిక నాగేశ్వరరావు సీబీఐ డైరక్టర్ గా పని చేసినప్పుడు ఆయనను కాకా పట్టేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనపై చాలా సమయం .. పేపర్ వెచ్చింది పెద్ద కథనాలే రాస్తున్నారు. కానీ రివర్స్ లో ఆయన ఒక్క సోషల్ మీడియా ప్రకటన చేసి.. సాక్షి పరువు తీశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గుర్తుపై కూటమికి పాక్షిక రిలీఫ్

జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులకు, అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని...

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close