తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా హాజరు కాలేదు. కొద్ది రోజులుగా తలసాని వ్యవహారం తేడాగా ఉంది.

కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్ని.. తెలంగాణ బాపు కేసీఆర్ అంటూ ఓ రేంజ్ లో నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత ఒక్క సారిగా చల్లబడిపోయారు. సికింద్రాబాద్ నుంచి తన కుమారుడికి సీటు కోసం ఆయన ఆ హంగామా చేశారు. పరిస్థితి తెలిసి వచ్చే సరికి ఆయన కుమారుడికి సీటు అవసరం లేదని ప్లేటు ఫిరాయించారు. అయితే తలసానినే పోటీ చేయమని కేసీఆర్ అడిగితే.. నిర్మోహమాటంగా నో చెప్పేశారు. దాంతో .. చివరికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును ఖరారు చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు నియోజకవర్గంలో తలసాని తిరగడం లేదు. పట్టించుకోవడం లేదు. రెండు రోజుల కిందట ఆయన అయోధ్య నుంచి రాముడ్ని దర్శించుకున్నట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో పెట్టారు. కొద్ది రోజులుగా ఆయన బీ జేపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పరోక్షంగా ఆయన బీజేపీకే సహకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. తలసానితో పాటు ఆయన కుమారుడు సాయికిరణ్ కూడా హాజరు కాలేదు. తమకు సమావేశం గురించి తెలియదని.. ఆహ్వానం రాలేదని ఆయన చెబుతున్నారు. తలసాని కొడుకు సమాధానం బట్టి.. బీఆర్ఎస్ కు ఇక తలసాని దూరమైనట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close