చంద్రబాబు సర్కార్‌ను కూల్చబోయింది కేసీఆరేనట !

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారంటూ.. ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ఉదంతంలో కేసీఆర్ చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ అసలు విషయం మాత్రం చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించింది కేసీఆరేనట. ఈ విషయాన్ని ఒకప్పుడు కేసీఆర్ ఆంతరంగిక మిత్రుడు.. మాజీ మంత్రి చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న చంద్రశేఖర్.. ఆ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. అరవై మంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్‌లోకి వెళ్లినట్లుగా చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని అప్పటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అప్రమత్తమయ్యారని… దీంతో కేసీఆర్ పాచికలు పారలేదని అంటున్నారు. ఈ అంశంపై ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలు బయటకు రాలేదు.కానీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చాలని కేసీఆర్ ప్రయత్నం చేసిన విషయం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ పెట్టుకున్నారు. అంతకు ముందు ఆయన ఈ ప్రయత్నం చేసి ఉంటారని భావిస్తున్నారు. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు చూసిన వాళ్లు దీన్ని కొట్టి పారేయలేమని చెబుతున్నారు. అదేసమయంలో చంద్రశేఖర్ మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. దళిత ముఖ్యమంత్రి హామీ ఇస్తే ప్రజల్ని మోసం చేసినట్లేనని.. ఇవ్వొద్దని చెప్పామన్నారు. కానీ వినిపించకోలేదని.. చంద్రశేకర్ చెబుతున్నారు. మొత్తంగా కేసీఆర్ ఒకప్పటి సన్నిహితులు ముందు ముందు చాలా విషయాలు బయట పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close