సీఐడీని వదలని హర్షకుమార్..!

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశాడని రాజధాని అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుపైనే అట్రాసిటి కేసులు పెట్టిన ఏపీ సీఐడీ అధికారులను ఎలాగైనా కోర్టుకు లాగాలన్న లక్ష్యంతో మాజీ ఎంపీ హర్షకుమార్ ఉన్నారు. ఏ జీవోను తప్పు అని చెప్పి సీఐడీ అధికారులు చెప్పారో.. ఆ జీవోను ఆదారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి సర్కార్ పెద్ద ఎత్తున దళితుల భూములను లాక్కుంది. ఇళ్ల స్థలాల పేరిట పంపిణీ చేసింది. ఆ జీవోను తప్పుగా చూపించి.. కేసులు పెట్టడంతో.. అదే జీవోను చూపించి పేద దళితుల భూములు లాక్కున్నందున.. ప్రస్తుత ప్రభుత్వంపైనా కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సమగ్రమైన వివరాలతో ఆయన సీఐడీకి ఫిర్యాదు లేఖ పంపారు.

పేదలకు ఇళ్ల పేరుతో దళితుల నుంచి ప్రభుత్వం అసైన్డ్ భూములు లాక్కుందని… ఆధారాలతో సహా సీఐడీకి లేఖ పంపానని హర్షకుమార్ ప్రకటించారు. సీఐడీ నమోదు చేసిన కేసుల ప్రకారం.. తాను ఇచ్చిన ఫిర్యాదును చూసి.. జగన్‌, బొత్స, ధర్మాన కృష్ణదాస్‌పై కేసులు పెట్టాలని.. నోటీసులు పంపి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని భూముల విషయంలో ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. దళిత రైతులందరూ తాము స్వచ్చందంగా భూములు రాజధానికి ఇచ్చామని ప్రకటించారు. అయితే ఇళ్ల స్థలాల కోసం సేకరించిన స్థలాలు అలాంటివి కావు.

ప్రభుత్వ భయంతో ఫిర్యాదులు చేయరేమో కానీ.. వారికి ధైర్యం కలిగిస్తే అసైన్డ్ రైతులందరూ.. ఫిర్యాదులు చేయడానికి సిద్ధంగా ఉంటారు. భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో చాలా మంది దళితులు ఆత్మహత్యాయత్నాలు చేశారు. కొంత మంది చనిపోయారు కూడా. ఇప్పుడు హర్షకుమార్ .. తన ఫిర్యాదుపై స్పందించకపోతే.. కోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టకూడదని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close