ఏపిలో కొత్తగా మరో 4 పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటు

ఏపిలో ప్రస్తుతం విశాఖ, తిరుపతి, పుట్టపర్తి పట్టాణాభివృద్ధి సంస్థలున్నాయి. ఈ మధ్యనే మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసారు. అమరావతి పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి అభివృద్ధి కోసం సి.ఆర్.డి.ఏ. ఏర్పాటు అయింది. ఇప్పుడు కొత్తగా మరో నాలుగు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

అనంతపురం-హిందూపురం కలిపి ఒకటి, కాకినాడ-రాజమండ్రిలకు కలిపి ఒకటి, కర్నూలు, నెల్లూరులకు చెరొక పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో చేయవలసిన సరిహద్దుల నిర్ణయం వంటి పనులన్నీ కూడా పూర్తయ్యాయి. అనంతపురం-హిందూపురం కలిపి పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తునందున పుట్టపర్తి పట్టణాభివృద్ధి సంస్థను రద్దు చేయాలని నిర్ణయించుకొన్నారు.

అలాగే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి మెట్రో హోదా కల్పించేందుకు విశాఖ మెట్రోపాలిటన్ అధారిటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ అందుకోసం ముందుగా మెట్రోపాలిటన్ చట్టానికి సవరణ చేయవలసి ఉంటుంది కనుక దానికి జి.ఓ.జారీ చేయబోతోంది. త్వరలో మంత్రివర్గ సమావేశమయినప్పుడు వీటన్నిటిపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకొంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

తేజా స‌జ్జా… క‌రెక్టు రూటులో!

'హ‌నుమాన్' లాంటి హిట్ త‌ర‌వాత ఏ హీరోకైనా కాస్త క‌న్‌ఫ్యూజన్ మొద‌లైపోతుంది. త‌ర‌వాత ఏం చేయాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతుంటారు. ఆ గంద‌ర‌గోళంలో త‌ప్పులు...

మేనిఫెస్టో మోసాలు : సీపీఎస్ రద్దు ఏది బాసూ !

" అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు " .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి... ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close