మరో వివాదంలో ఫ్రీడమ్ 251 మొబైల్స్ సంస్థ

హైదరాబాద్: రు.251లకే స్మార్ట్ ఫోన్‌ అందిస్తానంటూ సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్ సంస్థ మరో వివాదంలో ఇరుక్కుంది. ఆ సంస్థ తరపున కస్టమర్ కేర్ సేవలు అందిస్తున్న సైఫ్యూచర్ అనే బీపీఓ సంస్థ, రింగింగ్ బెల్స్ పెద్ద ఫ్రాడ్ అని ఆరోపించింది. తమకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించటంలేదని మండిపడింది. సైఫ్యూచర్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అనూజ్ భారతి మీడియాతో మాట్లాడుతూ, తమకు ఆ సంస్థ గురించి మొదటినుంచీ అనుమానంగానే ఉందని అన్నారు. ఎన్నో విడతలు చర్చలు జరిపిన తర్వాత… అదీ లాంచింగ్ కార్యక్రమానికి సీనియర్ రాజకీయ నాయకులు వస్తున్నారని చెప్పటంతో ఈ ప్రాజెక్టును తీసుకున్నామని చెప్పారు. లాంచింగ్ అయిన మొదటి రోజులలో లక్షల సంఖ్యలో కాల్స్ వచ్చాయని, వాటన్నంటికీ తాము చక్కగా సమాధానాలు చెప్పామని తెలిపారు. తమ సేవలపై వారు సంతోషం కూడా వ్యక్తం చేశారని చెప్పారు. అయితే పేమెంట్‌ల గురించి అడగగానే వారు తప్పుడు ఆరోపణలు చేస్తూ, సేవలు సంతృప్తికరంగా లేవంటూ తమ కాంట్రాక్ట్ రద్దు చేశారని అనూజ్ తెలిపారు. వారిదంతా మోసపూరిత వ్యవహారమని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. అయితే, రింగింగ్ బెల్స్ సంస్థ ప్రతినిధులు మాత్రం కస్టమర్ల కాల్స్‌కు సైఫ్యూచర్ సంస్థ సరిగా స్పందించలేదని ఆరోపించారు. దీనిపై వినియోగదారులు తమకు అనేక ఫిర్యాదులు చేశారని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close