కొనసాగుతున్న టీఆర్ఎస్ ‘ఆకర్ష్’: కాంగ్రెస్ మాజీ మంత్రి జంప్

హైదరాబాద్: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ గట్టి షాకే ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధృవీకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీసీసీ నాయకులు తనకు మాటమాత్రమైనా చెప్పకుండా చంద్రశేఖర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవని అన్నారు. కేటీఆర్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. కేసీఆర్ కూడా తనతో మాట్లాడారని తెలిపారు. త్వరలో టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు వెల్లడించారు.

ప్రసాద్ కుమార్ గుడిసెల వెంకటస్వామికి మేనల్లుడు… వివేక్, వినోద్‌లకు బావ. ప్రసాద్‌కు టీఆర్ఎస్‌లో తగిన గౌరవం ఇప్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రసాద్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన 30 మంది ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కూడా టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది. దీనితో రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కేటీఆర్ వ్యూహాలు పన్నినట్లు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జైల్లో కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు…ఈడీ కొత్త ఆరోపణ

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది ఈడీ. వైద్య పరమైన సాకులతో బెయిల్ పొందేందుకుగాను కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు ఉద్దేశ్యపూర్వకంగా...

తొలి రోజు నామినేషన్లకు ఆసక్తి చూపని వైసీపీ నేతలు

ఏపీలో నామినేషన్ల సందడి తొలి రోజు అంతా పసుపు హడావుడి కనిపించింది. కూటమిలోని పలువురు కీలక నేతలు తొలి రోజు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు...

తలసాని డుమ్మా – బాపు కేసీఆర్‌కు షాక్ ఇవ్వడమే తరువాయి !

బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్...

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close