వైకాపా నేత ద్వారంపూడిపై గాలి విమర్శలు

తుని విద్వంసానికి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డే కుట్రపన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడం అందరికీ తెలుసు. తెదేపా నేతలు, మంత్రులు కూడా వైకాపాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తెదేపా ఎమ్మెల్సి గాలి ముద్దు కృష్ణం నాయుడు వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చాలా తీవ్ర ఆరోపణలు చేసారు. అతనే తన రాయల్ పార్క్ హోటల్లో తన అనుచరులతో సమావేశమయ్యి ఈ కుట్రకు ప్లాన్ చేసారని ఆరోపించారు. వైకాపా తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మధ్య కులాల చిచ్చుపెట్టడం చాలా దారుణమయిన విషయమని ఆయన అన్నారు. తుని ఘటనలకు బాధ్యులయిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. తమ ప్రభుత్వం కాపులకు, బీసీలకు ఎవరికీ అన్యాయం చేయాలని ఎన్నడూ భావించలేదని, అందరినీ సమానంగానే చూస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా బీసీలకు నష్టం జరుగకుండా కాపులకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే జస్టిస్ మంజూనాద కమీషన్ ఏర్పాటు చేసామని తెలిపారు.

తుని ఘటనలో దోషులు ఎవరో కనుగొనేందుకు సిఐడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సి గాలి ముద్దు కృష్ణం నాయుడు ఈ కుట్రను ఎవరు పన్నారో, ఎక్కడ పన్నారో వంటి వివరాలను మీడియా ముందుకు వచ్చి తెలియజేయడం కంటే సిఐడి పోలీసులకే తెలియజేస్తే బాగుండేది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close