గల్లా కుటుంబం ఇక రాజకీయాలకు దూరమా !?

చిత్తూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా ఉన్న గల్లా ఫ్యామిలీ ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అమరరాజా కంపెనీలపై ఏపీ ప్రభుత్వం విరుచుకుపడిన తర్వాత గల్లా జయదేవ్ సైలెంట్ అయ్యారు. ఆయన అప్పుడప్పుడూ కనిపిస్తున్నారు. కానీ టీడీపీ కార్యక్రమాల్లో.. రాజధాని వ్యవహారాల్లో గతంలోలా యాక్టివ్‌గా లేరు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానానికి ఆయన పోటీ చేయడం లేదన్న ప్రచారం కూడా అప్పుడే ప్రారంభమయింది. ఆయన స్వచ్చందంగా తప్పుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు గల్లా అరుణ కుమారి కూడా ఇక తాను రాజకీయాల్లో ఉండనని ప్రకటించేశారు. 2014లో చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత లా నెమ్మదిగా రాజకీయాలకు దూరం ఉంటూ వచ్చారు.. 2019 ఎన్నికలకు ముందుగానే తాను నియోజకవర్గం భాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టీడీపీ పొలిట్ బ్యూరోలో చాన్సిచ్చినా తర్వాత వైదొలిగారు. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు.. తన రాజకీయ ప్రయాణం ముగిసిందని, సేవా ప్రయాణం మొదలు పెట్టానని ప్రకటించారు. తన అనుచరులు ఏ పార్టీలో భవిష్యత్ ఉంటే ఆ పార్టీలో చేరిపోవచ్చని సలహా ఇచ్చారు.

గల్లా జయదేవ్ ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి పోటీ చేస్తారేమో తెలియదు కానీ.. ఇప్పటికైతే గల్లా ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంది. నిజానికి గల్లా జయదేవ్ సోదరి అమెరికా నుంచి తిరిగి వచ్చేసి తిరుపతిలో భారీ ఆస్పత్రి ప్రారంభించారు. ఆమె చంద్రగిరి నుంచి లేదా మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే రాజకీయం అమరరాజా వ్యాపార సామ్రాజ్యం మీద గురి పెట్టడంతో ఆ ఫ్యామిలీ వెనక్కి తగ్గుతున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close