చిరంజీవిని కలిసిన గంటా , నారాయణ !

మెగాస్టార్ చిరంజీవిని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ కలిశారు. లు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బోళా శంకర్ సినిమా షూటింగ్ సెట్‌లో ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు, చిరంజీవి మంచి మిత్రులు, అలాగే గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణలు వియ్యంకులు. వీరిద్దరూ కలిసి చిరంజీవి కలవడంతో తమ కుటుంబంలో ఏదో శుభకార్యానికి అహ్వనించేందుకు కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత.. చిరంజీవి మెల్లగా రాజకీయాలకు దూరమయ్యారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత తాను ఇక క్రియాశీలక రాజకీయాలకు దూరమని ప్రకటించారు. ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినప్పటికి ఆయన మాత్రం తాను రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటించేనని నిర్మోహమాటంగాప్రకటించారు. రాజకీయ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు .

గంటా శ్రీనివాసరావు, పొంగురూ నారాయణలు గత ప్రభుత్వంలో మంత్రులగా పని చేశారు. కానీ టీడీపీ ఓడిపోయిన తర్వాత ఇద్దరూ సైలెంట్ అయ్యారు. పొంగూరు నారాయణపై ప్రభుత్వం పలు రకాల కేసులు పెట్టింది. అయిన న్యాయపోరాటం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి మరోసారి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు ఇటీవలి కాలంలో టీడీపీలో యాక్టివ్ అయ్యారు. లోకేష్ పాదయాత్ర .. ఇతర అంశాల్లో తరచూ స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్నీ విమర్శిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వారిద్దరూ కలిసి చిరంజీవితో భేటీ కావడం సహజంగానే రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close