ఈ నెల 23న ఆది పుట్టినరోజు సందర్భంగా ‘గరం’ ఆడియో రిలీజ్

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన చిత్రం ‘గరం’. ఇందులో అదా శర్మ కథానాయికగా నటించింది. ఈ నెల 23న ఆది బర్త్ డే. ఈ సందర్భంగా ‘గరం’ ఆడియో ఆవిష్కరణ వేడక జరగనుంది. అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలో పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొననున్నారు. ‘పెళ్లైన కొత్తలో’ ఫేం అగస్త్య ఈ చిత్రానికి స్వరాలందించారు.

ఈ సందర్భగా పి. సురేఖ మాట్లాడుతూ – ”కథాబలం ఉన్న ఈ చిత్రంలో పాటలకు స్కోప్ ఉంది. అగస్త్య అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. మంచి మ్యూజికల్ హిట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ.. ఇలా అన్ని అంశాలూ ఉన్న మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. ఇటీవల ప్రభాస్ విడుదల చేసిన ఈ చిత్రం మొదటి టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందుతాయనే నమ్మకం ఉంది” అని చెప్పారు.

మదన్ మాట్లాడుతూ – ”ద్వేషించే వారిని ప్రేమించే స్థాయికి ఎదగడం చాలా కష్టం. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ చిత్రం చేశాం. శ్రీనివాస్ చెప్పిన ఈ కథ నచ్చి, సినిమా చేశాం. ఇప్పటివరకూ చేసిన చిత్రాల ద్వారా తనలో మంచి నటుడు ఉన్నాడని ఆది నిరూపించుకున్నాడు. ఈ చిత్రం నటుడిగా తనకు మరింత పేరు తెచ్చిపెడుతుంది. పాత్రను ప్రేమించి చేశాడు” అని తెలిపారు.

ఆది మాట్లాడుతూ – ”స్ర్కీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ ఇచ్చిన కథను మదన్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. అగస్త్య మంచి పాటలిచ్చారు” అన్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు – శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా – సురేందర్ రెడ్డి.టి, సంగీతం – ఆగస్త్య, కళ – నాగేంద్ర, ఎడిటింగ్ – కార్తీక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత – బాబ్జీ, కో-డైరెక్టర్ – అనిల్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం – మదన్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close