గరికపాటికి సినిమా పాఠాలు చెబుతున్న నెటిజన్స్

అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అవధాన ప్రక్రియ, ప్రవచనాల్లో ప్రసిద్ధులైన ఆయనకు ఇటీవల కేంద్రప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌ గరికపాటిని ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా సినిమాల ప్రస్తావన వచ్చింది. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా కొన్ని సినిమాలు ఉండటం లేదని అన్నారు గరికపాటి. ఇక్కడే ‘పుష్ప’ సినిమా గురించి చెబుతూ.. స్మగ్లర్‌ని హీరోగా ఎలా చూపిస్తారంటూ ప్రశ్నించారు. ”స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం. స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి ‘తగ్గేదే లే’ అంటాడా? ఇప్పుడు అదొక సూక్తి అయిపోయింది. ఒక కుర్రాడు ఎదుటివ్యక్తిని కొట్టి.. ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఈ డైలాగ్‌ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ‘తగ్గేదే లే’ అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదు’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యనించారు గరికపాటి. అంతేకాదు.. ఇది ఎంతవరకూ న్యాయమో హీరో, దర్శకుడు దీనికి సమాధానం చెప్పాలన్నారు.

కాగా గరికపాటి చేసిన కామెంట్స్ నెట్లో వైరల్ గా మారాయి. బేసిగ్గా ఇలాంటి వ్యాఖ్యలు తెరపైకి వచ్చేటప్పుడు సినిమాని సినిమాగా చూడాలని, దాన్ని ఒక కళారూపంగా చూడాలే తప్పితే సినిమానే మొత్తం సమాజాన్ని మార్చేస్తుందని వ్యాఖ్యానించడం తగదని కామెంట్స్ వినిపిస్తుంటాయి. గరికపాటి వ్యాఖ్యలపై కూడా ఇదే రకంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ”గురువు గారు సినిమాని సినిమాగానే చూడండి” అంటూ హితువుపలుకుతున్నారు కొందరు. మరికొందరైతే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ చెప్పిన డైలాగ్ కారణంగా సమాజం చెడిపోయే పరిస్థితి లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా గరికపాటి పద్మశ్రీ అందుకుంటున్న సమయంలో చేసిన ఈ కామెంట్స్ చర్చకు దారితీశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close